కరోనాపై దేశవ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో సెలబ్రిటీలు తమవంతు భాగం అవుతూ ప్రజలకి అవగాహన కల్పిస్తున్నారు. లాక్ డౌన్ వేళ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ప్రజలని చైతన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఇదిలా మరో వైపు లాక్ డౌన్ వేళ సినీ కళాకారులకి సాయం అందించేందుకు ముందుకొస్తున్నారు.ఇక కరోనాపై అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ అందరూ కలిసి ఫ్యామిలీ అనే షార్ట్ ఫిలిం తీసారు.
ఇప్పుడు నటుడు సాయి కుమార్ కూడా తనవంతుగా కరోనా సమయంలో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, పోలీస్, పారిశుద్ధ్య సిబ్బంది సేవలని కొనియాడుతూ షార్ట్ ఫిలిం రూపొందించారు.
సాయి కుమార్ తన కుమారుడు ఆది, కుమార్తె జ్యోతిర్మయితో కలిసి ఈ షార్ట్ ఫిలిం తీసారు.
ఇందులో డాక్టర్ పాత్రలో జ్యోతిర్మయి, పారిశుద్ధ్య కార్మికుడి పాత్రలో ఆది, పోలీసు పాత్రలో సాయికుమార్ నటించారు.పోలీస్, పబ్లిక్ ఒకటైతే కరోనాను తరిమివేయగలమని, అంతిమ విజయం మనదే అంటూ సాయికుమార్ విశ్వాసం వ్యక్తం చేయడంతో పాటు, ఇలాంటి విపత్కర సమయంలో విధి నిర్వహణలో ఈ మూడు విభాగాలు ఎంత బాధ్యతాయుతంగా పని చేస్తున్నాయి.
వారికి ప్రజలు సహకరించాల్సిన ఆవశ్యకత గురించి ఇందులో చూపించారు.