మీడియా ముందుకు వస్తున్న సాయి ధరమ్ తేజ్..!

బైక్ యాక్సిడెంట్ తర్వాత సాయి ధరం తేజ్ పబ్లిక్ లోకి రాలేదు.హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జ్ మీద బైక్ స్కిడ్ అవడం వల్ల సాయి ధరం తేజ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి.

 Sai Dharam Tej Will Attend Media Meet For Republic Digital Release Promotions ,-TeluguStop.com

దాదాపు నెల రోజుల దాకా అపోలో హాస్పిటల్ లో ఉంచి ట్రీట్ మెంట్ అందించారు.ప్రస్తుతం సాయి ధరం తేజ్ బాగానే ఉన్నాడు.

అయితే అభిమానుల కోసం మీడియా ముందుకు రావాలని చూస్తున్నాడు సాయి ధరం తేజ్.చిన్నపాటి సర్జరీ అనంతరం కోలుకున్న సాయి ధరం తేజ్ అంతా సెట్ రైట్ అయినట్టు తెలుస్తుంది.

ఇక తను హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా డిజిటల్ రిలీజ్ సందర్భంగా ప్రమోషన్స్ లో సాయి ధరం తేజ్ పాల్గొంటాడని తెలుస్తుంది.రిపబ్లిక్ థియేటర్ రిలీజ్ టైం లో ప్రమోషన్స్ చేయలేకపోయిన సాయి ధరం తేజ్ డిజిటల్ రిలీజ్ టైం లో సినిమాకు సపోర్ట్ గా ఉండాలని చూస్తున్నాడు.

అంతేకాదు ఆఫ్టర్ యాక్సిడెంట్ మొదటిసారి మీడియా ముందుకు వస్తున్న సందర్భంగా అసలు ఆరోజు ఏం జరిగింది అన్న విషయాలను కూడా తేజ్ ప్రస్థావిస్తారని తెలుస్తుంది.ఇక సాయి ధరం తేజ్ చేయాల్సిన సినిమాలన్ని 2022 కి వాయిదా వేసినట్టు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube