కరోనా కారణంగా థియేటర్లు ఎనిమిది నెలలు పూర్తిగా మూసే ఉన్నాయి.ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల పునః ప్రారంభం అయ్యింది.
సినిమాల విడుదల కూడా మెల్లగా మొదలు అవుతున్నాయి.నేడు శుక్రవారం అవ్వడంతో కొత్త సినిమాలు కూడా విడుదల అయ్యాయి.
అయితే జనాలు మాత్రం థియేటర్ల ముందుకు రావడం లేదు.థియేటర్లు తెరుచుకున్న విషయం కూడా చాలా మంది ప్రేక్షకులకు తెలియడం లేదు.
ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడంతో యాజమాన్యాలు మళ్లీ థియేటర్లను కొన్నాళ్ల పాటు మూసేయాలనే ఉద్దేశ్యంను కూడా వ్యక్తం చేస్తున్నారు.ఈ సమయంలోనే హీరోలు థియేటర్లకు జనాలు రావాలంటూ పిలుపునిస్తున్నారు.
ఈ సమయంలోనే మహేష్ బాబు తన మల్టీ ప్లెక్స్ ఏఎంబీని ప్రమోట్ చేశాడు.ప్రతి ఒక్క జాగ్రత్త తీసుకుంటూ సినిమాను మీ ముందుకు తీసుకు వచ్చాం.
కనుక తప్పకుండా సినిమాను ఎంజాయ్ చేయండి అంటూ ట్వీట్ చేశాడు.
థియేటర్లకు జనాలు వెళ్లని ఈ పరిస్థితుల్లో మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ముందుకు వచ్చి తాను సినిమాకు వెళ్తాను.
నాతో పాటు మీరు సినిమాకు రండి అంటూ ప్రేక్షకులను పిలిచినట్లుగా వీడియో చేశాడు.ఐమాక్స్ కు సాయి ధరమ్ తేజ్ వెళ్లాడు.అక్కడ ఉన్న సెక్యూరిటీ ఏర్పాట్లు శానిటైజేషన్ విధానంను చూపించాడు.అన్ని థియేటర్లలో కూడా ఇలా ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు కూడా సినిమాను ఎంజాయ్ చేయాలని సూచించాడు.
ఈ ఎనిమిది నెలలుగా మిస్ అయిన ఎంటర్టైన్ మెంట్ ను మళ్లీ పొందండి అంటూ సాయి ధరమ్ తేజ్ పేర్కొన్నాడు.వీడియో విడుదల చేసిన తేజ్ ఘట్స్ కు అంతా అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇలా ప్రతి ఒక్కరు కూడా థియేటర్ కు వెళ్లి సినిమా థియేటర్ల పునః ప్రారంభం విషయాన్ని ఎక్కువగా జనాల్లోకి తీసుకువెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ నెటిజన్స్ మరియు ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.