టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.ముఖ్యంగా స్టార్ హీరోలు కలిసి నటిస్తే చూడాలని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఇక కుటుంబ హీరోలు కూడా కలిసి నటించాలని ఫ్యాన్స్ ఆశపడుతూ ఉంటారు.మెగా ఫ్యామిలిలో హీరోలు చాలా మంది ఉన్నారు.
వారిలో ఇద్దరు ముగ్గురు అయినా కలిసి నటించాలనేది మెగా ఫ్యాన్స్ కోరిక.
కొన్ని రోజుల క్రితం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇంకా వరుణ్ తేజ్ లు మల్టీ స్టారర్ సినిమాపై ఆసక్తి ఉన్నట్లుగా పేర్కొన్నారు.
ఇద్దరు కూడా మంచి కథ వస్తే కలిసి నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా ప్రకటించారు.వారిద్దరి కోసం ఒక ప్రముఖ రచయిత కథను సిద్ధం చేశాడట.ఆ కథ అల్లు అరవింద్ వద్దకు వెళ్లినట్లుగా ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.
ప్రస్తుతం గీత ఆర్ట్స్ కు చెందిన రచయితలు ఆ కథకు మెరుగులు దిద్దే పనిలో ఉన్నారు.ఆ తర్వాత కథను ఇద్దరు హీరోలకు వినిపించే అవకాశం ఉందని అంటున్నారు.ఒకవేళ ఇద్దరు ఆ కథకు ఒకే చెప్తే 2022 లో ఖచ్చితంగా మెగా యంగ్ స్టార్స్ మల్టీస్టారర్ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఇదే కనుక నిజం అయితే మెగా ఫ్యాన్స్ కు పెద్ద పండుగే.