సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నారు.ఈ సమయంలోనే ఆయన దేవకట్టా దర్శకత్వంలో నటించినటువంటి రిపబ్లిక్ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది.
పొలిటికల్ థ్రిల్లర్ రిపబ్లి ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్ పతాకంపై ఈ చిత్రాన్ని జె.భగవాన్, జె.పుల్లారావు నిర్మిస్తున్నారు.ఇందులో సాయి ధరమ్ తేజ్ ఒక ఐఏఎస్ పాత్రలో కనిపించగా సాయి తేజ్ సరసన ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
సామాజిక అంశాలను ప్రధానాంశాలుగా తీసుకొని ఈ సినిమాని తెరకెక్కించడంతో ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుందని ప్రస్తుత పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఈ సినిమా ఉండబోతోందని దర్శకుడు వెల్లడించారు.
ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సెన్సార్ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది.ఈ చిత్రానికి సెన్సార్ సభ్యులు యు/ఎ సర్టిఫికేట్ ఇవ్వడమే కాకుండా అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా విడుదల చేశారు.
గాంధీ జయంతి సందర్భంగా ఈ సినిమాని అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతోందని ఉన్నటువంటి పోస్టర్ను చిత్రబృందం విడుదల చేశారు.
ఇందులో సాయి ధరమ్ తేజ్ టోపీ పెట్టుకొని చాలా ఇంటెన్సివ్ లుక్ లో కనిపిస్తున్నారు.సాయి ధరమ్ తేజ్ ఇప్పటి వరకు ఏ సినిమాలో నటించన విధంగా ఈ సినిమాలో ఐఏఎస్ పాత్రలో నటించడం,ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పోస్టర్లను బట్టి చూస్తే ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని తెలుస్తుంది.ఇకపోతే ఈ సినిమా అక్టోబర్ 1వ తేదీన విడుదల కానున్న నేపథ్యంలో సాయి ధరమ్ తేజ్ ప్రమాదం కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉండడం కొంతవరకు బాధ కలిగించే విషయం అని చెప్పవచ్చు.
ఇకపోతే ఈ సినిమాలో రమ్యకృష్ణ జగపతిబాబు కీలక పాత్రలో నటిస్తున్నారు.