మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన రీసెంట్ మూవీ ‘ప్రతిరోజూ పండగే’తో అదిరిపోయే హిట్ అందుకున్నాడు.ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రావడంతో తన నెక్ట్స్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ను పూర్తి యూత్ఫుల్ మూవీగా తీర్చిదిద్దాడు.
కాగా ఈ సినిమా రిలీజ్కు రెడీ అయ్యింది.కానీ కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.
దీంతో ప్రస్తుతం తేజు తన నెక్ట్స్ చిత్రాలను లైన్లో పెట్టే పనిలో పడ్డాడు.
ఇప్పటికే దర్శకుడు దేవా కట్టాతో ఓ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న తేజు, తన నెక్ట్స్ మూవీలను కూడా ఎంచుకుంటున్నాడు.
ఈ క్రమంలోనే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యానర్లో మరోసారి నటించేందుకు ఈ హీరో ఓకే అన్నాడట.దర్శకుడు విరించి వర్మ వినిపించిన ఓ కథ తేజుకు నచ్చడంతో ఈ సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
ఇక ఈ సినిమాను దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి సబ్జెక్ట్తో వస్తుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.
అయితే గతంలో దిల్ రాజు బ్యానర్లో తేజు ఏకంగా మూడు సినిమాలు చేశాడు.
పిల్లా నువ్వు లేని జీవితం, సుప్రీమ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి వరుస విజయాలను అందుకున్న తేజు, మరోసారి దిల్ రాజుతో చేతులు కలపడంతో ఈసారి ఎలాంటి సక్సెస్ను అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.ఇక ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంత్ త్వరలో రానున్నట్లు తెలుస్తోంది.