మెగాహీరో సాయిధరమ్ తేజ్ హీరోగా.దేవకట్టా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “రిపబ్లిక్“.
ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని అక్టోబర్ ఒకటవ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ క్రమంలోనే చిత్రబృందం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేయాలని భావించారు.
ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈనెల 26వ తేదీ ఫ్రీ రిలీజ్ వేడుకను ఏర్పాటు చేశారు.అయితే ఈ సినిమా ప్రమోషన్లలో హీరో సాయి తేజ వస్తారా .రారా.అన్న అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది.
సాయి తేజ్ కు సెప్టెంబర్ 10వ తేదీ రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే అతనికి కాలర్ బోన్ సర్జరీ చేసిన వైద్యులు కొన్ని రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
ఇలాంటి సమయంలో తాను నటించిన రిపబ్లిక్ సినిమా విడుదల కావడంతో సాయి తేజ్ ప్రమోషన్స్ కి దూరం అవుతున్నారని తెలుస్తోంది.అయితే ప్రస్తుతం సాయి తేజ్ ఆరోగ్యం కుదటపడటం వల్ల సినిమా విడుదల రెండు మూడు రోజులు ముందుగా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నబోతున్నారని సమాచారం.
ఇలా ప్రమాదంలో తగిలిన గాయాలతో సాయి తేజ్ ప్రమోషన్లలో పాల్గొనడం ఎంతవరకు సమంజసం అనే ఈ విషయం అర్థం కాకపోయినప్పటికీ వైద్యుల సూచనలు సలహా మేరకు ఇతను బయటకు వస్తారని తెలుస్తోంది.ఏదిఏమైనప్పటికీ తమ హీరో నటించిన సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో తను లేకపోవడం మెగా అభిమానులకు కొంత లోటు కనబడుతుందని చెప్పవచ్చు.ఈ సినిమా తరువాత మరో రెండు సినిమాలకు కమిట్ అయిన సాయి తేజ్ ఈ సినిమాలను డిసెంబర్ లో సెట్స్ పైకి తీసుకెళ్ళనున్నట్లు సమాచారం.