అనుకున్నట్టుగానే తిక్క టీజర్ తో అందరిని మరోసారి వారెవా అనిపించాడు మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్.సునీల్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా టీజర్ అసలైతే నిన్న రిలీజ్ అవ్వాల్సింది.
కొన్ని టెక్నికల్ కారణాల వల్ల టీజర్ రిలీజ్ చేయట్లేదని ట్వీట్ చేసిన చిత్రయూనిట్ కొద్ది గంటల క్రితం టీజర్ రిలీజ్ చేశారు.రీసెంట్ గా సుప్రీం హిట్ తో మంచి జోష్ లో ఉన్న సాయి ధరం తేజ్ అదే జోరుని తిక్కలో కనిపించినట్టు అనిపించింది.
సినిమాలో తేజు లుక్ మాత్రమే కాదు కథ కూడా కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది.ఇక హీరోయిన్ గా చోప్రా సిస్టర్ మన్నారా చోప్రా కనిపించిన రెండు చోట్ల సూపర్బ్ అనేలా ఉంది.
ప్రస్తుతం సునీల్ జక్కన్నతో పాటు మరో సినిమాలో నటించిన మన్నారా చోప్రా మొదటి సినిమా తిక్క త్వరలో రిలీజ్ అవుతుంది.ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా ఆగష్టు మొదటి రెండు వారాల్లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు దర్శక నిర్మాతలు.
.