మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ సోలో బ్రతుకే సో బెటర్ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీ అయ్యింది.ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సక్సెస్ను అందుకోవాలని తేజు చూస్తున్నాడు.
కాగా ఈ సినిమాను పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కించడంతో ఈ సినిమా కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే తాజాగా తేజు తన కొత్త చిత్రాన్ని అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చాడు.
సుకుమార్ రైటింగ్స్లో రాబోతున్న ఈ సినిమాకు కథను సుకుమార్ అందిస్తుండటంతో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి.ఇక ఈ సినిమాకు సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేశారు.
ఈ పోస్టర్లో సంస్కృత శ్లోకం ఉండటంతో ఈ సినిమా ఎలాంటి కాన్సెప్ట్తో వస్తుందో తెలియని కన్ఫ్యూజన్ ప్రేక్షకుల్లో ఏర్పడింది.ఈ పోస్టర్లో షట్చక్రాల మధ్యలో ఓ కన్ను చూస్తుండటంతో ఈ సినిమా కాన్సెప్ట్ ఏమిటో అర్థం కాని పరిస్థితిలో నెలకొంది.
ఇక ఈ సినిమాకు సుకుమార్ అసిస్టెంట్ కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తుండగా ఈ సినిమాను బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నాడు.ఇక ఈ సినిమాలో మిగతా నటీనటులు ఎవరనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
కాగా ఈ సినిమాతో తేజు మరోసారి ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి రెడీ అయ్యాడు.మరి ఈ సినిమా ఎలాంటి కాన్సెప్ట్తో వస్తుందో చూడాలి అంటున్నారు సినీ ప్రేక్షకులు.