సాయి ధరమ్ తేజ్ చిత్రలహరికి ముందు వరుసగా ఆరు ఫ్లాప్లను చవిచూశాడు.ఆ ఆరు సినిమాలు కూడా తేజ్ కెరీర్ను మళ్లీ మొదటికి తీసుకు వచ్చాయి.
అయినా కూడా ఏమాత్రం నిరుత్సాహ పడకుండా చిత్రలహరితో మళ్లీ కెరీర్ను రీ బిగిన్ చేశాడు.చిత్రలహరి కాస్త పర్వాలేదు అనిపించింది.
మళ్లీ ప్రతి రోజు పండగే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా దర్శకుడు మారుతి ఈ సినిమాను రూపొందించాడు.
ఇటీవలే విడుదలైన ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుంది.
ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రతి రోజు పండుగే సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆశ్చర్యకర వ్యాఖ్యలు చేశాడు.
ఇకపై తాను చేసేవి అన్ని కూడా సక్సెస్ సినిమాలే అని ఖచ్చితంగా సక్సెస్ అయ్యే సినిమాలు మాత్రమే చేస్తానంటూ ఈ సందర్బంగా చెప్పుకొచ్చాడు.ఇప్పటి వరకు చేసిన తప్పులను పునరావృతం కాకుండా జాగ్రత్త పడతానంటూ చెప్పుకొచ్చాడు.
మంచి కథలు ఎంచుకుంటూ చేయబోయే ప్రతి సినిమాను కూడా సక్సెస్ చేసుకోవాలని ప్రయత్నించబోతున్నట్లుగా చెప్పాడు.సక్సెస్ అనేది మన చేతిలో ఉంటే ఎవరైనా సక్సెస్ చేసుకునేందుకే ప్రయత్నిస్తారు.
మరి గతంలో ఆరు ఫ్లాప్లు వచ్చినప్పుడు ఎందుకు ఆ ప్రయత్నం చేయలేదో ఆయనే చెప్పాలి.