మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ వేసవి కానుకగా రిలీజ్ కావాల్సి ఉంది.కానీ కరోనా వైరస్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.
ఇక ఈ సినిమా షూటింగ్ కొంతమేర మిగిలి ఉండటంతో, ఇది తిరిగి ఎప్పుడు ప్రారంభిస్తారా అనే క్లారిటీ లేకుండా పోయింది.అయితే అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ సాయి ధరమ్ తేజ్ సోలో బ్రతుకే సో బెటర్ షూటింగ్ను తిరిగి ప్రారంభించాడు.
రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమా షూటింగ్ను సోమవారం తిరిగి ప్రారంభించారు.కాగా ఈ షూటింగ్లో హీరో తేజుతో పాటు హీరోయిన్ నభా నటేష్ కూడా పాల్గొంది.
ఇక చాలా గ్యాప్ తరువాత తిరిగి షూటింగ్ చేయడం సంతోషంగా ఉందని హీరోయిన్ నభా నటేష్ అంటోంది.కాగా సుబ్బు అనే దర్శకుడు ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తోండగా, పూర్తి యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారు చిత్ర యూనిట్.
ఈ సినిమాలోని పాటలను ఇప్పటికే రిలీజ్ చేయగా, వాటికి ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు.
ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో, ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
తేజు లాస్ట్ చిత్రం ‘ప్రతిరోజూ పండగే’తో అదిరిపోయే హిట్ అందుకున్నాడు.దీంతో ఇప్పుడు ‘సోలో బ్రతుకే సో బెటర్’ కూడా అదిరిపోయే హిట్ అందుకోవడం ఖాయమని చిత్ర యూనిట్తో పాటు మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
మరి సోలో బ్రతుకే చిత్రం తేజుకు ఎలాంటి విజాయాన్ని అందిస్తుందో చూడాలి.