మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తు్న్న లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్కు రెడీగా ఉంది.ఈ సినిమాను పూర్తి యూత్ఫుల్ ఎంటర్టైనర్గా దర్శకుడు సుబ్బు తెరకెక్కించడంతో ఈ సినిమా అదిరిపోయే సక్సె్స్ అందుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇక ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాయి.
అయితే వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది.
కానీ కరోనా వైరస్ ప్రభావంతో లాక్డౌన్ అమలులో ఉండటంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.ఇక థియేటర్లు తెరుచుకున్న వెంటనే ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ ప్లా్న్ చేశారు.
కానీ ఇప్పట్లో థియేటర్లు తెరుచుకునే ఊసే కనిపించడం లేదు.దీంతో ఈ సినిమాను ఓటీటీ డిజిటల్ ప్లాట్ఫాంలో రిలీజ్ చేస్తారని చిత్ర వర్గాల్లో వార్తలు వినిపించాయి.
తాజాగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం వారు ఏకంగా రూ.25 కోట్ల ఆఫర్ను ప్రకటించారట.ఈ సినిమాకు ఇంత రేటు రావడంతో చిత్ర యూనిట్ ఆలోచనలో పడినట్లు వార్తలు వస్తున్నాయి.అయితే తేజు మాత్రం సినిమాను థియేటర్లలోనే రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్కు తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.
బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నభా నటేష్ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.
మరి సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం ఓటీటీలో రిలీజ్ అవుతుందో లేదో చూడాలి.