టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్లలో ఒకరైనా రానా దగ్గుబాటి అందరినీ అవాక్కు చేస్తూ ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.మిహికా బజాజ్ అనే అమ్మాయిని రానా ప్రేమించి వివాహం చేసుకోబోతున్నాడు.
దీంతో ఇండస్ట్రీలోని మిగతా యంగ్ హీరోలు ఈ పెళ్లి గురించి చర్చించుకుంటున్నారు.ఇందులో ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి చెందిన సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ల మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
అయితే ఈ క్రమంలో సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’ అంటూ పాట పాడుతున్నాడు.అసలు విషయం ఏమిటంటే, తేజు నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ చిత్రాన్ని రిలీజ్కు రెడీ చేశాడు.
కాగా ఈ సినిమాలోని ఓ సరికొత్త పాటను మే 25న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించాడు.‘నో పెళ్లి’ అనే ఈ పాటతో మరోసారి బ్యాచ్లర్స్ను ఉర్రూతలూగించేందుకు తేజు రెడీ అవుతున్నాడు.
కాగా సుబ్బు అనే కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నభా నటేష్ హీరోయిన్గా నటిస్తోంది.ఈ సినిమాను పూర్తి యూత్ ఎంటర్టైనర్ మూవీగా తేజు మనముందుకు తీసుకొస్తున్నాడు.
ఇక ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తుండగా, థమన్ సంగీతం అందిస్తున్నాడు.మరి ‘నో పెళ్లి’ అనే పాట రానా పెళ్లికి ఏమైనా అడ్డంకి తీసుకొస్తుందేమో చూడాలి అంటున్నారు కామన్ ఫ్యాన్స్.