“మెగాస్టార్” చిరంజీవికి మేనల్లుడుగా చలన చిత్ర రంగ ప్రవేశం చేసిన ప్రముఖ నటుడు
సాయి ధరమ్ తేజ్.
వై.వి.ఎస్.చౌదరి “రేయ్” చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి, “పిల్లా నువ్వులేని జీవితం” చిత్రంతో తెరంగేట్రం చేసారు.మొదటి సినిమా మంచి విజయాన్ని అందుకావడంతో వరుస సినిమాలతో బిజీ అయిపోయారు.
ఆ తర్వాత కొన్ని ప్లాప్ లు రావడంతో ఆయన కథను ఎంచుకోవడంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నారు.ఈ క్రమంలోనే ప్రస్తుతం వరుస సినిమా అవకాశాలను అందిపుచ్చుకుని ఎంతో బిజీగా ఉన్నటువంటి సాయి ధరంతేజ్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమయంలో తన గురించి తన లవ్ స్టోరీ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
సాయి ధరమ్ తేజ్ తన లవ్ స్టోరీ గురించి చెప్తూ… చిన్నపుడు పక్క బెంచీ అమ్మాయికి సైట్ కొట్టడానికి దొంగ చూపులు చూసే వాడినని అన్నారు.ఆ తర్వాత కాలేజ్ లో ఉన్నపుడు మాత్రం ఒక గర్ల్ ఫ్రెండ్ ఐతే ఉండేదని, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆ రిలేషన్ కుదరలేదని ఆయన తెలిపారు.
అదీ కాక వాళ్ళింట్లో కూడా ఒప్పుకోలేదని ఆయన అన్నారు.సినీ ఇండస్ట్రీకి వచ్చాక అయితే ఎవరూ లేరని సాయి ధరమ్ తేజ్ తన చిన్నప్పటి లవ్ స్టోరీ గురించి ఓ ఇంటర్వ్యూలో తెలియజేస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
ఇకపోతే ఇటీవలి కాలంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ సాయి ధరమ్ తేజ్ ఇప్పుడిప్పుడే కొలుకుంటున్నట్టు తెలుస్తోంది.కాగా ఈ మధ్యే ఆయన తీసిన రిపబ్లిక్ సినిమా విడుదల కావడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతానికైతే ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుందని ప్రేక్షకుల నుంచి టాక్ కూడా వస్తోంది.రెండు రోజుల క్రితం తన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని స్వయానా సాయితేజ్ ట్వీట్ చేయడంతో అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ తన ప్రాణాలకు ఏ విధమైన ప్రమాదం లేదని సంతోషపడ్డారు.