మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రిపబ్లిక్.ఈ సినిమాకు దేవ కట్టా దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది.ఈ సినిమాను పొలిటికల్ త్రిల్లర్ గా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.
జూన్ 4 న విడుదల అవుతున్న నేపథ్యంలో ఈ సినిమా టీజర్ ఈ రోజు విడుదల చేసారు చిత్ర యూనిట్.
ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఈ సినిమాలో సి ఎం పాత్రలో నటిస్తుంది.కొద్దిరోజుల క్రితం రమ్య కృష్ణ లుక్ కూడా రివీల్ చేసారు.
ఈ సినిమాలో కూడా ఈమె పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు.ఈ సినిమా టీజర్ సుకుమార్ చేతుల మీదగా విడుదల చేసారు.
ఈ సినిమా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కుతుంది కాబట్టి టీజర్ లో రాజకీయ సన్నివేశాలు ఆలోచింపచేసేలా ఉన్నాయి.ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓటు హక్కో.అరిచే హక్కో అనే భ్రమలో ఉన్నాం.కానీ కట్టకుండా కూలిపోతున్న వ్యవస్థలే ప్రజాస్వామ్యానికి పునాదులని తెలియకుండా ఇంకా ఫ్యూడల్ వ్యవస్థలోనే మనం బతుకుతున్నాం.అనే డైలాగ్ తో ఈ టీజర్ మొదలయ్యింది.ఈ టీజర్ లో ఈ డైలాగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఐఏఎస్ అధికారిగా నటిస్తున్నాడు.సాయి ధరమ్ 14 వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భగవాన్, పుల్లారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
ఈ టీజర్ లో సాయి ధరమ్ తేజ్, రమ్య కృష్ణ పాత్రలను పరిచయం చేసారు.రమ్య కృష్ణ, సాయి ధరమ్ తేజ్ లుక్ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.