మెగాస్టార్ మేనల్లుడిగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్.అంతేకాదు వరస సినిమాలు చేస్తూ హిట్స్ కూడా అందుకున్నాడు.
ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రిపబ్లిక్.ఈ సినిమాకు దేవ కట్టా దర్శకత్వం వహిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి స్పందన వచ్చింది.
దర్శకుడు దేవ కట్టా ఈ సినిమాను పొలిటికల్ త్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడు.
ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుంది.సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఈ సినిమాలో సి ఎం పాత్రలో నటిస్తుంది.
కొద్దిరోజుల క్రితం రమ్య కృష్ణ లుక్ కూడా రివీల్ చేసారు.ఈ సినిమాలో కూడా ఈమె పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చిత్ర యూనిట్ మొదటి నుండి చెబుతున్నారు.
ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ ఐఏఎస్ అధికారిగా నటిస్తున్నాడు.సాయి ధరమ్ 14 వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భగవాన్, పుల్లారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
ఈ సినిమా ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడింది.
అయితే ఇప్పుడిప్పుడే దేశంలో పరిస్థితులు మళ్ళీ మాములు స్థితికి వస్తున్నాయి.
అందుకే ఈ సినిమాను వీలైనంత త్వరగా విడుదల చేయాలనీ అనుకుంటున్నారట.ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా స్టార్ట్ చేశారట.
వచ్చే నెల థియేటర్స్ ఓపెన్ అవుతాయని అనుకుంటున్నారని తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా థియేటర్స్ ఓపెన్ అవ్వగానే విడుదల చేయాలనీ మేకర్స్ అనుకుంటున్నారని అందుకు పనులు కూడా పూర్తి చేస్తున్నారని తెలుస్తుంది.త్వరలోనే విడుదల తేదీని కూడా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.మరి చూడాలి ఈ సినిమాతో సాయి ధరమ్ తేజ్ ఏ మేరకు ప్రేక్షకులను అలరిస్తాడో.