కరోనా సెకండ్ వేవ్ తర్వాత అతి పెద్ద విజయంగా లవ్ స్టోరీ నిలిచింది.నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
దాంతో ఆ సినిమాను ఆదర్శంగా తీసుకుని వరుసగా సినిమాలు వచ్చాయి.లవ్ స్టోరీ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో మెగా బ్రదర్స్ మూవీస్ పై అందరు కూడా దృష్టి పెట్టారు.
మెగా బ్రదర్స్ సాయి ధరమ్ తేజ్ మరియు వైష్ణవ్ తేజ్ లు హీరోలుగా రెండు వేరు వేరు సినిమా లు వచ్చాయి.ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాయనే నమ్మకంను అంతా వ్యక్తం చేశారు.
కేవలం వారం రోజుల గ్యాప్ లో వచ్చిన రిపబ్లిక్ మరియు కొండ పొలం సినిమా లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి.రిపబ్లిక్ సినిమాకు రివ్యూలు చాలా పాజిటివ్ గా వచ్చాయి.
ఒక మంచి మెసేజ్ ను చూపించారు అంటూ అంతా కూడా అభినందించారు.ఇదే సమయంలో మంచి కథను తీసుకు వచ్చారు అంటూ కొండ పొలంను కూడా అభినందించారు.
ఇద్దరు మెగా బ్రదర్స్ కూడా వసూళ్ల విషయంలో నిరాశ పర్చినా కూడా మంచి సినిమాను చేశారు అనే పేరును మాత్రం దక్కించుకున్నారు.ఉప్పెన వంటి సూపర్ హిట్ సినిమాతో సక్సెస్ దక్కించుకున్న వైష్ణవ్ తేజ్ కు కొండ పొలం ఫలితం ఖచ్చితంగా నిరాశ పర్చేదే అనడంలో సందేహం లేదు.కాని సాయి ధరమ్ తేజ్ కు మాత్రం రిపబ్లిక్ మూవీ కమర్షియల్ గా సక్సెస్ దక్కించుకోలేక పోయినా కూడా టాక్ పరంగా మంచి సినిమా అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.నెట్టింట ఈ రెండు సినిమా ల గురించి చాలా పాజిటివ్ చర్చ జరిగింది.
కనుక వసూళ్ల విషయంలో అస్సలు చర్చ అవసరం లేదు.రాజ్యాంగంలో ఉన్న లొసుగులు ఏంటీ.
వాటిని ఉపయోగించుకుని కొందరు వ్యవహరిస్తున్న తీరును రిపబ్లిక్ లో చూపించగా.ఒక యువకుడు తనపై తనకు నమ్మకం లేకుండా ఉన్నట్లయితే జీవితంలో ఎదగలేడు అనే విషయాన్ని కొండ పొలంలో చూపించారు.
రెండు కూడా మంచి మెసేజ్ లు.వసూళ్ల పరంగా చూస్తే రెండు కూడా బ్రేక్ ఈవెన్ ను చేరుకోలేదు అనేది టాక్.