గతేడాది సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు సాయిధరమ్ తేజ్.ఈ సినిమా విడుదల సమయంలోనే సాయిధరమ్ తేజ్ పెళ్లికి సంబంధించి వార్తలు రాగా ఆ వార్తలు నిజం కాలేదు.
అయితే సాయిధరమ్ తేజ్ పెళ్లి గురించి మళ్లీ జోరుగా ప్రచారం జరుగుతోంది.ఇండస్ట్రీ వర్గాల్లో త్వరలో సాయిధరమ్ తేజ్ పెళ్లి జరగబోతుందని.
ఈ ఏడాది మే నెలలో పెళ్లి జరిగే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే సాయిధరమ్ తేజ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కూడా చిరంజీవి చెల్లెలు, తేజ్ తల్లి ఫిక్స్ చేశారని తెలుస్తోంది.
వధువు మెగా ఫ్యామిలీకి తెలిసిన అమ్మాయేనని తెలుస్తోంది.సాయితేజ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి సినిమా ఇండస్ట్రీకి సంబంధం లేదని వార్తలు వస్తున్నాయి.అయితే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాలంటే మాత్రం అధికారక ప్రకటన వెలువడే వరకు ఆగాల్సిందే.
సాయిధరమ్ తేజ్ పెళ్లి గురించి వార్తలు రావడం ఇదే తొలిసారి కాదు.
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లలో ఒకరైన సాయిధరమ్ తేజ్ పెళ్లి గురించి మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.గతేడాది డిసెంబర్ నెల 9వ తేదీన నిహారిక వివాహం జరగగా నిహారిక పెళ్లి తరువాత సాయితేజ్ పెళ్లిపై ఒత్తిడి పెరుగుతోంది.
సాయిధరమ్ తేజ్ కూడా ఒక ఇంటర్వ్యూలో తాను సింగిల్ అని.తన కుటుంబం పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోందని తెలిపారు.
మరోవైపు సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం రిపబ్లిక్ అనే సినిమాలో నటిస్తున్నారు.పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవ్ కట్టా దర్శకత్వం వహిస్తున్నారు.జేబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది.సాయిధరమ్ తేజ్ కు జోడీగా ఐశ్వర్యా రాజేష్ ఈ సినిమాలో నటిస్తుండగా ఈ ఏడాది జూన్ 4వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.