మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం దేవా కట్టా దర్శకత్వంలో రిపబ్లిక్ మూవీ చేస్తున్నాడు.ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది.
దీని తర్వాత కార్తిక్ దండు అనే కొత్త కుర్రాడితో సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.సుకుమార్, బివిఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
కార్తిక్ దండు కూడా సుకుమార్ శిష్యుడే కావడం విశేషం.ఈ నేపధ్యంలో అతన్ని కూడా నిలబెట్టడానికి సుకుమార్ సిద్ధమయ్యాడు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా ముందు కృతి శెట్టిని తీసుకోవాలని భావించారు.అయితే అప్పటికే కృతి శెట్టి ఉప్పెన సినిమా చేస్తూ ఉండటంతో ఆ సినిమా తర్వాత ఒక్కసారిగా ఈ బ్యూటీ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయినా కూడా ఉప్పెన కోసం ఫైనల్ చేసిన ఆమెని సాయి తేజ్ కి జోడీగా తీసుకోవడానికి అనుకున్నారు.
అయితే తమ్ముడుతో చేస్తున్న ఆమెతో వెంటనే తాను చేయడం అంత కరెక్ట్ గా ఉండదని, ఆడియన్స్ నుంచి నెగిటివిటి వచ్చే అవకాశం ఉందని భావించిన సాయి ధరమ్ తేజ్ వద్దని ఆ ప్రపోజల్ ని పక్కన పెట్టినట్లు తెలుస్తుంది.
దీంతో దర్శక, నిర్మాతలు కూడా కృతి శెట్టిని తీసుకోవాలనే ఆలోచన విరమించుకొని మరో కొత్త అమ్మాయి కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది.
అయితే ఈ మూవీ ఉప్పెన సినిమా టైంలోనే స్టార్ట్ చేసిన కూడా ఏవో కారణాల వలన వాయిదా పడుతుంది.దీంతో సాయి తేజ్ రిపబ్లిక్ మూవీని ముందుకి తీసుకొచ్చి దాన్ని సెట్స్ పైకి తీసుకెళ్ళిపోయాడు.
ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత కార్తిక్ దండు దర్శకత్వంలో మూవీ స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది.ఇక ఈ మూవీ కోసం ఓ కొత్త హీరోయిన్ ని తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది.