మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటించని తాజా చిత్రం ప్రతి రోజూ పండగే డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూసిన తేజు ఆశ నిజమైంది.
మారుతి అందించిన పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీతో తేజు బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుకున్నాడు.
వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న తేజుకు ఈ సినిమా మంచి బూస్టునిచ్చింది.
మరే ఇతర సినిమాలు పోటీలో లేకపోవడంతో ఈ సినిమాకు బాగా కలిసొచ్చింది.కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా దూసుకుపోవడంతో 17 రోజులు ముగిసేసరికి ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.27.91 కోట్ల వసూళ్లు కొల్లగొట్టింది.
రాశి ఖన్నా హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కామన్ ఆడియెన్స్కు బాగా కనెక్ట్ అయ్యాయి.ఇక ఈ సినిమా 17 రోజుల కెలక్షన్లు ఏరియా వారీగా ఈ విధంగా ఉన్నాయి.
నైజాం – 11.70 కోట్లు
సీడెడ్ – 3.73 కోట్లు
నెల్లూరు – 0.84 కోట్లు
కృష్ణా – 1.95 కోట్లు
గుంటూరు – 1.84 కోట్లు
వైజాగ్ – 4.46 కోట్లు
ఈస్ట్ – 1.93 కోట్లు
వెస్ట్ – 1.46 కోట్లు
టోటల్ ఏపీ+తెలంగాణ – 27.91 కోట్లు