మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పిల్ల నువ్వులేని జీవితం సినిమాతో హీరోగా పరిచయం అయ్యి ఒక మోస్తరు హిట్ అందుకున్నాడు.ఈ సినిమా తర్వాత సుప్రీం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.
ఈ మెగా హీరో సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండడు.ఎప్పుడో ఒక పోస్టు పెడుతూ ఉంటాడు.
అయితే తాజాగా సాయి తేజ్ ఒక పోస్ట్ పెట్టాడు.
ఈ రోజు చాలా స్పెషల్ డే అంటూ సాయి ధరమ్ తేజ్ పోస్ట్ షేర్ చేసాడు.
ఆయన ఒక ఫోటోను షేర్ చేసాడు.ఆ ఫోటో ఇప్పుడు నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది.
ఆ ఫొటోలో రెండు పులి పిల్లలు ఉన్నాయి.ఆ పులి పిల్లలను తేజ్ పెంచుకుంటున్నాడు.
ఈ రోజు ఎర్త్ డే సందర్భంగా తన పెట్స్ తో దిగిన ఫోటోలను సాయి తేజ్ షేర్ చేసాడు.
ఆ పులి పిల్లలు ఆడుకుంటుండగా సాయి తేజ్ పక్కనే ఉండి ఫోటో దిగాడు.
వాటి పేర్లు కూడా తెలిపాడు.అందులో ఒక పులి పిల్ల పేరు లాయనల్, మరొక దాని పేరు లేరోయ్ అని తెలిపాడు.
ఆ పులి పిల్లలు చాలా క్యూట్ గా ఉన్నాయి.ఈ ఫోటో నెటిజన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి.
ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది ఇలా ఉండగా ప్రస్తుతం ఈయన రిపబ్లిక్ సినిమా చేస్తున్నాడు.ఈ సినిమాకు దేవ కట్టా దర్శకత్వం వహిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదల అయినా మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్, టీజర్ కు మంచి స్పందన వచ్చింది.
దర్శకుడు ఈ సినిమాను పొలిటికల్ త్రిల్లర్ గా దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ కూడా ఈ సినిమాలో నటిస్తుంది.ఈమె పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని చిత్ర యూనిట్ చెబుతున్నారు.
జూన్ 4 న విడుదల చేయాలనీ భావిస్తున్నారు.జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై భగవాన్, పుల్లారావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమాతో పాటు మరొక రెండు సినిమాలు కూడా లైన్లో పెట్టాడు.