ప్రస్తుతం టాలీవుడ్ లో సాయి తేజ్వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు.తాజాగా ప్రముఖ దర్శకుడు మారుతి దర్శకత్వం వహించిన టువంటి ప్రతీరోజు పండగే చిత్రంలో సాయి తేజ్ హీరోగా నటించాడు.
ఈ చిత్రంలో సాయి తేజ్ సరసన అందాల తార రాశి కన్నా నటించగా సీనియర్ నటులు సత్య రాజ్, విజయ్ కుమార్, రావు రమేష్, హరితేజ రంగస్థలం మహేష్ వంటి వారు ప్రధాన తారాగణంగా నటించారు.
అయితే ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన టువంటి ఈ చిత్రం బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని నమోదు చేసింది.
అంతేగాక వసూళ్ళ పరంగా కూడా సాయి తేజ కెరియర్లోనే ది బెస్ట్ చిత్రంగా నిలిచింది.దీంతో సాయి తేజ్ మేనమామ అయినటువంటి జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతడికి అభినందనలు తెలుపుతూ డియర్ సాయి ధరమ్ తేజ్ గారు ప్రతి రోజు పండగే చిత్రం విజయవంతం అయినందుకు గాను కంగ్రాట్యులేషన్స్ అని, అలాగే ఓకే తను భవిష్యత్తులో చేయబోయే చిత్రాలకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.
ఈ విషయంపై తాజాగా సాయి ధరమ్ తేజ్ స్పందించారు.ఇందులో భాగంగా మీకు ధన్యవాదాలు తెలపడానికి మాటలు సరిపోవడం లేదు.లవ్ యూ పవన్ కళ్యాణ్ మామ. అంటూ బదులు ఇచ్చారు.దీంతో ప్రస్తుతం సాయి తేజ్ ఈ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు.ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి చిత్రంతో మంచి విజయాన్ని అందుకొని ప్రతి రోజు పండగే తన ఫామ్ ని కొనసాగించాడు.