సాయి ధరమ్‌ తేజ్‌ అమ్మానాన్న విడాకులు.. మొదటి సారి నోరు విప్పిన తేజ్‌

మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ వరుసగా ఆరు ఫ్లాప్‌ల తర్వాత ఎట్టకేలకు చిత్రలహరి చిత్రంతో సక్సెస్‌ను దక్కించుకున్నాడు.భారీ అంచనాల నడుమ రూపొందిన ఆ చిత్రంపై మొదటి నుండి అంచనాలు భారీగా ఉన్నాయి.

 Sai Dharam Tej Parents-TeluguStop.com

అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉండటంతో తేజ్‌ ఈసారి గట్టెక్కినట్లయ్యింది.బయ్యర్లు ఇప్పటికే సేఫ్‌ అయ్యారు.

నష్టాలు లేకుండా బయ్యర్లు సేఫ్‌ అయిన నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు సంతోషంగా ఉన్నారు.ఈ సంతోషంను మీడియాతో షేర్‌ చేసుకునేందుకు తేజ్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేశాడు.

ఆ సందర్బంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన తల్లిదండ్రుల గురించి ఆసక్తికర విషయాన్ని బయటకు చెప్పాడు.

సాయి ధరమ్‌ తేజ్‌ 10వ క్లాస్‌లో ఉన్న సమయంలో అంటే దాదాపు 15 ఏళ్ల క్రితం అమ్మా, నాన్న విడిపోయారట.

చిరంజీవి గారి చెల్లి విడాకులు తీసుకున్న విషయం ఇండస్ట్రీలో మారు మ్రోగిపోవాలి.కాని అప్పుడు పెద్దగా సోషల్‌ మీడియా లేని కారణంగా ప్రచారం జరగలేదు.తల్లిదండ్రుల విడాకుల విషయమై మొదటి సారి తేజ్‌ స్పందిస్తూ… ఆ సమయంలో వారిద్దరు కలిసి ఉండటం కష్టం అయ్యింది.కలిసి ఉండలేం అనుకుంటే విడిపోవడం మంచిది.

అందుకే వారి అభిప్రాయంను నేను గౌరవిస్తాను.విడాకులు తీసుకున్న తర్వాత అమ్మ నన్ను, తమ్ముడిని కష్టపడి పెంచింది.

ఇద్దరం కూడా ఆమె నిర్ణయంను గౌరవించాం.

అమ్మ ఒంటరిగా ఫీల్‌ అవుతున్న కారణంగా ఆమె మరో పెళ్లి చేసుకునేలా ఒప్పించాం.2011వ సంవత్సరంలో అమ్మ మరో పెళ్లి చేసుకుంది.అమ్మ చేసుకున్న వ్యక్తి డాక్టర్‌.

ఆయన మంచి వ్యక్తి, మాతో చాలా బాగా ఉంటాడు.ఇక నాన్నతో ఇంకా సంబంధాలు కొనసాగుతున్నాయి.

ఆయనకు సినిమా గురించి తెలియదు కనుక ఈ విషయాలను ఆయనతో షేర్‌ చేసుకోం.కాని ఆయనకు మా తండ్రిగా స్థానం ఉందని చెప్పుకొచ్చాడు.

మొత్తానికి తేజ్‌ తల్లిదండ్రుల విడాకుల విషయం గురించి చెప్పి చర్చనీయాంశం అయ్యాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube