మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సుదీర్ఘ ఫ్లాప్స్ తర్వాత వరుసగా చిత్రలహరి మరియు ప్రతిరోజూ పండుగే చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ను దక్కించుకున్నాడు.ఆ సినిమాలు ఇచ్చిన బూస్ట్తో సోలో బ్రతుకే సో బెటర్ అనే చిత్రాన్ని చేశాడు.
ఈ సినిమాను సమ్మర్లో విడుదల చేసి మరో సినిమాను దేవా కట్టాతో చేసేందుకు రెడీ అయ్యాడు.ఈ ఏడాదిలో రెండు సినిమాలను విడుదల చేయాలని తీవ్రంగా ప్రయత్నించాడు.
సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యాడు.ఈ రెండు సినిమాల షూటింగ్స్ కూడా ఆగిపోయాయి.సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం షూటింగ్ కూడా బ్యాలన్స్ ఉంది.షూటింగ్ లాక్డౌన్ తర్వాత పూర్తి చేసినా వెంటనే విడుదల చేసే పరిస్థితి లేదు.
కనుక దేవా కట్టా మూవీ ఇప్పట్లో ప్రారంభించే విషయమై ఆలోచనలో ఉన్నట్లుగా సమాచారం అందుతోంది.కనీసం ఈ ఏడాదిలో ఒక్క సినిమా అయినా విడుదల చేస్తాడా లేదా అనేది ప్రస్తుతం అనుమానంగా ఉంది.
ఈ ఏడాది రెండు సినిమాలు చేయాలనుకున్న సాయి ధరమ్ తేజ్ ఆశ నిరాశ అయ్యింది.సినిమాల నిర్మాణం తగ్గడంతో ఈయన సినిమాల సంఖ్య కూడా తగ్గే అవకాశాలున్నాయంటున్నారు.ప్రతి ఏడాది రెండు సినిమాలు చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్న ఈ మెగా హీరో సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం ఫలితంను బట్టి తదుపరి చిత్రం ఉంటుందని సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈయన ఒక్కడి పరిస్థితి మాత్రమే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరికి కూడా ఇదే పరిస్థితి.
గతంలో మాదిరిగా నిర్మాతలు సినిమాలు నిర్మించే పరిస్థితి లేదు.కనుక తేజ్కు ప్రతి రోజు పండుగే వంటి హిట్ పడ్డా కూడా దాన్ని ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది.