ఊరించి ఊరించి ఉసూరు మనిపించాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.సినిమా రేంజ్ లో బిల్డప్ ఇచ్చి తుస్సు మనిపించాడు.’ప్రతిరోజూ పండగే’ సినిమా విజయం సాధించడంతో ఫుల్ జోష్ మీద ఉన్న మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం సుబ్బు డైరక్షన్ లో సోలో బతుకే సో బెటరు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.
అయితే,నిన్న తన ట్విట్టర్ ఖాతా లో ఒక ఆసక్తికర వీడియో పోస్ట్ చేశాడు.దానిలో ఇటీవల టాలీవుడ్ లో వరుసగా పెళ్లిళ్లు చేసుకున్న సోలో హీరోల పేర్లు ప్రస్తావిస్తూ వారంతా పెళ్లి చేసుకున్నప్పుడు పెట్టిన పోస్ట్ లను మరోసారి పోస్ట్ చేసి,సోమవారం 10 గంటలకు గుడ్ న్యూస్ చెబుతా అంటూ చివరగా సారీ ప్రభాస్ భయ్యా అని టాటా చెప్పాడు.
దీనితో ఆ పోస్ట్ లు చూసిన ప్రతి ఒక్కరూ కూడా మెగా మేనల్లుడు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నాడు అంటూ అందరూ భావించి ఉదయం 10 గంటలకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే ‘ఒక్కోసారి మనం ఎన్నో అనుకుంటాం కానీ టైం వచ్చినప్పుడు మరి’ అని తేజ్ పెట్టిన పోస్ట్ ను సార్ధకతమ్ చేస్తూ ఈ రోజు ఉదయం 10 గంటలకు తన పెళ్లి గురించి చెప్పకుండా తన సినిమాలోని ఓ పాట గురించి ప్రకటన చేసి నిరాశపర్చాడు.ఇప్పటికే సోలో బతుకే సో బెటరు సినిమా నుంచి ‘నో పెళ్లి’ సాంగ్ని విడుదల చేయగా, ఇప్పుడు రెండో పాటను విడుదల చేస్తున్నామంటూ ఆయన ప్రకటించాడు.‘అంత స్ట్రిక్ట్గా సోలో బ్రతుకు సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్ కి అమృత ని చూశాక ఏమైంది???’ అంటూ ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆయన విడుదల చేశాడు.‘హేయ్ నేనేనా’ అంటూ సాగే ఈ పాటను ఈ నెల 26న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని చెప్పాడు.
అయితే, పర్సనల్ విషయం గురించి చెబుతాడనుకుంటే సినిమా గురించి చెప్పాడంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.మరి ఇంత మోసమా తేజు అంటూ తెగ ఫీల్ అయిపోతున్నారు.మొత్తానికి ఎదో అనుకుంటే ఎదో జరిగింది అన్నట్లుగా తేజు పెట్టిన పోస్ట్ కి నెటిజన్లు ఫీల్ అవుతున్నారు.