ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా మాధ్యమాలలో సినీ సెలబ్రిటీలు బాగానే యాక్టివ్ గా ఉంటున్నారు.ఈ క్రమంలో అప్పుడప్పుడు కొందరు సెలబ్రిటీలు చిట్ చాట్ కార్యక్రమాలు నిర్వహించడం మరియు లైవ్ కార్యక్రమాలు నిర్వహించడం వంటి వాటి ద్వారా తన అభిమానులకు బాగానే అందుబాటులో ఉంటున్నారు.
అయితే తాజాగా మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కూడా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా నెటిజన్లతో ముచ్చటించాడు.ఈ క్రమంలో కొందరు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు.
అయితే ఇందులో ఓ నెటిజన్ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ “అన్న మీ ఫోన్ నెంబర్ పంపించరా.” అని అడిగాడు.దీంతో సాయి ధరమ్ తేజ్ తనదైన శైలిలో స్పందిస్తూ ఎమ్మెస్ నారాయణ ఫోటోని జోడిస్తూ రిప్లై ఇచ్చాడు.కాగా శివమణి సినిమాలో ఓ సన్నివేశంలో ఎమ్మెస్ నారాయణని ఫోన్ కాల్స్ తో విసిగిస్తారు.
దీంతో సాయి ధరమ్ తేజ్ కూడా నీకు ఫోన్ నెంబర్ ఇస్తే నా పరిస్థితి ఇదే అంటూ రిప్లై ఇచ్చాడు.దీంతో ఆ నెటిజన్ అవాక్కయ్యాడు.అంతేకాక మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరని మరో నెటిజన్ అడగడంతో వెంటనే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ “అక్కినేని సమంత” ఫోటోలు జోడిస్తూ రిప్లై ఇచ్చాడు.
ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య సాయి తేజ హీరోగా నటించిన “సోలో బ్రతుకే సో బెటర్” చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.దీంతో సాయి ధరమ్ తేజ్ తన తదుపరి చిత్రాల కథల విషయంలో కొంతమేర ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు.కాగా ప్రస్తుతం తెలుగులో ప్రముఖ దర్శకుడు “దేవ కట్టా” దర్శకత్వం వహిస్తున్న “రిపబ్లిక్” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.
ఈ చిత్రంలో సాయి ధరమ్ తేజ్ కి జోడిగా ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఈ చిత్రంలో జగపతి బాబు రమ్య కృష్ణ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
కాగా ఈ చిత్రం ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్ల సమచారం.