మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే.కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతుండటంతో ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే తన నెక్ట్స్ మూవీని కూడా లైన్లో పెడుతున్నాడు తేజు.వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కించే దర్శకుడిగా దేవా కట్టా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు.
గతంలో ఆయన తెరకెక్కించిన ప్రస్థానం చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఈ సినిమాను ఇటీవల హిందీలో కూడా రీమేక్ చేశారు దేవా కట్టా.
కాగా ప్రస్తుతం తేజుతో కలిసి మరోసారి పొలిటికల్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కించేందుకు దేవా కట్టా రెడీ అయ్యాడు.ఇక తొలి షెడ్యూల్ షూటింగ్ను జరుపుకుంటున్న ఈ సినిమాలో తేజు పర్ఫార్మెన్స్ సినిమాకే హైలైట్ కానుందని తెలుస్తోంది.
కాగా ఈ సినిమాకు ‘రిపబ్లిక్’ అనే టైటిల్ను చిత్ర యూనిట్ ఓకే చేసినట్లు తెలుస్తోంది.ఇలాంటి టైటిల్తో తేజు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది.
అయితే ఈ సినిమాకు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం జీ5 అదిరిపోయే ఆఫర్ను అందించినట్లు తెలుస్తోంది.ఇప్పటికే సోలో బ్రతుకే సో బెటర్ చిత్రాన్ని సొంతం చేసుకున్న జీ5, ఇప్పుడు ఈ సినిమా కోసం ఏకంగా రూ.35 కోట్ల భారీ ఆఫర్ను అందించినట్లు తెలుస్తోంది.అయితే ఈ చిత్ర యూనిట్ మాత్రం ఇప్పుడే ఈ సినిమా హక్కుల విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకు రెడీగా లేదని తెలుస్తోంది.
ఏదేమైనా పూర్తి పొలిటికల్ ఎంటర్టైనర్తో రాబోతున్న తేజు ప్రేక్షకులను ఎంతమేర మెప్పిస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.కాగా ఈ సినిమాలో తేజు ఐఏఎస్ పాత్రలో చాలా పవర్ఫుల్గా కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
ఇక ఈ సినిమాలో శివగామి రమ్యకృష్ణ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు, ఆమె పాత్ర ఈ సినిమాకు మేజర్ అసెట్ కానున్నట్లు తెలుస్తోంది.కాగా ఈ సినిమాలో తేజు సరసన హీరోయిన్గా నివేతా పేతురాజ్ నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.
ఇక ఈ సినిమాను జె.భగవాన్, పుల్లారావు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు.