మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రిపబ్లిక్ సినిమాతో ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.దేవా కట్టా డైరక్షన్ లో యంగ్ ఐ.
ఏ.ఎస్ ఆఫీసర్ గా సాయి ధరమ్ తేజ్ తన నటనతో మెప్పించాడు.ఈ సినిమా తర్వాత సుకుమార్ అసిస్టెంట్ కార్తీక్ డైరెక్షన్ లో ఓ పిరియాడికల్ మూవీ చేస్తున్నాడు తేజ్.ఇదేకాకుండా లేటెస్ట్ గా తన నెక్స్ట్ మూవీ కూడా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.
మెగా డైరెక్టర్ సంపత్ నందితో మెగా మేనల్లుడు సినిమా ఉంటుందని తెలుస్తుంది.
రామ్ చరణ్ తో రచ్చ సినిమా చేసిన సంపత్ నంది రీసెంట్ గా గోపీచంద్ తో సీటీమార్ సినిమా చేశాడు.
ఈ సినిమా తర్వాత సాయి ధరమ్ తేజ్ తో సంపత్ నంది సినిమా ఫిక్స్ చేసుకున్నారట.సీటీమార్ కూడా ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు.
మరి కెరియర్ లో అసలు ఏమాత్రం ఫాం లో లేని సంపత్ నందితో సాయి ధరమ్ తేజ్ సినిమా. ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.
సాయి ధరమ్ తేజ్ కెరియర్ విషయంలో చాలా కేర్ ఫుల్ గా ఉంటున్నాడు.రిపబ్లిక్ ఓటీటీ రిలీజ్ వల్ల కమర్షియల్ లెక్కలేమి తెలియలేదు.
అందుకే ఈసారి థియేట్రికల్ రిలీజ్ తో సత్తా చాటాలని చూస్తున్నాడు.