మెగా హీరో సాయిధరమ్ తేజ్ చాలా కాలం తర్వాత ‘చిత్రలహరి’ చిత్రంతో ఒక మోస్తరు సక్సెస్ను దక్కించుకున్నాడు.వరుసగా ఆరు ఫ్లాప్లు వచ్చిన ఈసమయంలో సాయి ధరమ్ తేజ్కు వచ్చిన చిత్రలహరి సక్సెస్ ఆయనలో కొత్త ఉత్సాహంను నింపింది.
విభిన్నంగా ట్రై చేస్తే తప్పకుండా సక్సెస్ దక్కుతుందని ఈ చిత్రం నిరూపించింది.అందుకే తప్పకుండా ఈ చిత్రం సాయి ధరమ్ తేజ్ కొత్త తరహా చిత్రాలను ఎంపిక చేసుకునే పనిలో ఉన్నాడు.
త్వరలోనే మారుతి దర్శకత్వంలో మెగా మేనల్లుడు ఒక చిత్రంలో నటించేందుకు సిద్దం అవుతున్నాడు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాల గురించి చెప్పుకొచ్చాడు, అమ్మానాన్నల విడాకులు మరియు అమ్మ మరో పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చిన సాయి ధరమ్ తేజ్ తన పెళ్లి విషయంలో కూడా ఒక ప్రకటన చేశాడు.చాలా కాలంగా నాగబాబు కూతురు నిహారికను సాయి ధరమ్ తేజ్ పెళ్లి చేసుకోబోతున్నాడు.
మేనమామ అయిన నాగబాబు బిడ్డను తేజ్ పెళ్లి చేసుకునేందుకు సిద్దం అయ్యాడు అంటూ ప్రచారం జరుగుతుంది.ఆ వార్తలపై తేజ్ చాలా సార్లు ఖండిస్తూ స్పందించాడు.
తాజాగా ఇంటర్వ్యూలో మరోసారి ఆ విషయమై చర్చకు వచ్చింది.మీరు నిహారికను పెళ్లి చేసుకుంటారా అంటూ ఎవరైనా అడిగితే నాకు కింది నుండి మీది వరకు మండి, వాడిని లాగి పెట్టి కొట్టాలనిపిస్తుంది.
ఎందుకంటే ఎవరైనా చెల్లిని పెళ్లి చేసుకుంటావా అంటే ఎలా ఉంటుంది.అలాగే నాకు ఉంటుంది.
అత్యంత కోపం వస్తుంది.మేము అంతా కూడా చిన్నప్పటి నుండి కలిసి పోయి పెరిగాయి.
అందుకే నేను నిహారికను చెల్లిగా చూస్తాను.అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అంటే ఏమనాలి చెప్పండి.