సెలబ్రెటీలు చిన్న యాక్సిడెంట్స్ చేసినా కూడా తాగి బండి నడిపాడు ఓవర్ స్పీడ్ లేదంటే మరోటి అంటూ విమర్శలు చేసే వారు చాలా మంది ఉన్నారు.నిన్న రాత్రి సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ చేసినా కూడా మొదట చాలా మంది తేజూ తాగి ఉన్నాడేమో అంటూ విమర్శలు చేయడం మొదలు పెట్టారు.
అయితే తేజూ విషయంలో ఎక్కడ కూడా ఎలాంటి తప్పు లేదు అని సీసీ టీవీ ఫుటేజ్ ను బట్టి తేలిపోయింది.అతడి స్పీడ్ నార్మల్ గా ఉంది దానికి తోడు అతడు చాలా సేఫ్టీ ఫ్రికాషన్స్ తీసుకున్నాడు.అందువల్ల అతడికి దెబ్బలు తగల్లేదు.తలకు హెల్మెట్ పెట్టుకున్నాడు.షూ వేసుకుని ఉన్నాడు.అంతే కాకుండా గ్లౌజ్ లు పెట్టుకుని ఉండటం వల్ల చాలా సేఫ్టీ అయ్యింది.
అతడికి స్వల్పంగా మాత్రమే దెబ్బలు తగిలాయి.ఈ విషయాలను సోషల్ మీడియాలో ప్రచారం చేసేందుకు మెగా పీఆర్ టీమ్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.
సోషల్ మీడియాలో మెగా కాంపౌండ్ కు చెందిన పీఆర్ లు పలువురు రంగంలోకి దిగి జనాల్లో తేజూ తప్పులేదు.కేవలం అక్కడ ఇసుక ఉండటం వల్ల స్కిడ్ అయ్యింది.
ఆ సమయంలో ఆల్కహాల్ తాగి లేడు దానికి తోడు తేజూ చాలా స్లోగానే వెళ్తున్నాడు.కనుక ఎలాంటి విమర్శలు చేయడానికి లేదు.
ఒక వేళ సీసీ టీవీ ఫుటేజ్ లేకుంటే తేజూ జీవితాంతం చెప్పినా కూడా ఆయన తాగలేదు.స్లోగానే వెళ్తున్నాను అంటే నమ్మేవారు కాదేమో అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
మొత్తానికి సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ చిన్నదే అని దానికి కూడా అతడి తప్పు ఏమీ లేదు రోడ్డు మీద ఇసుక ఉండటం వల్ల స్కిడ్ అయ్యిందని చెబుతున్నారు.తేజూ ను ఈ విషయంలో బదనాం చేసేలా ఎవరైనా విమర్శలు చేసిన వ్యాఖ్యలు చేసినా కూడా వెంటనే రెస్పాండ్ అవుతున్నారు.అలా తేజూ కెరీర్ లో ఇదో తప్పుడు ముద్ర లా లేకుండా మెగా పీఆర్ టీమ్ తాపత్రయ పడుతున్నారు.త్వరలో తేజూ తన రిపబ్లిక్ సినిమా తో వస్తాడనుకుంటూ ఉండగా ఇలా యాక్సిడెంట్ అవ్వడం చర్చనీయాంశం అయ్యింది.
సినిమా విడుదలకు సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని కొందరు ఊహలు వ్యక్తం చేస్తున్నారు.