బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్తో సినిమా చేయాలంటే ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్కు అయినా భయం వేస్తుంది.కాని కేవలం ఒకే ఒక్క సినిమా ఏజ్ కలిగిన దర్శకుడు సుజీత్ మాత్రం ఏమాత్రం భయం లేకుండా ఏకంగా 350 కోట్ల బడ్జెట్తో సాహో చిత్రాన్ని తెరకెక్కించాడు.
సాహో చిత్రంను సుజీత్ తీస్తున్నన్ని రోజులు ఆయన్ను ప్రభాస్ ఫ్యాన్స్ నెత్తిన నుండి దించలేదు.అంతగా సుజీత్ను మోశారు.
ఒక హాలీవుడ్ స్థాయి మూవీని ప్రభాస్తో చేస్తున్నందుకు తాము చాలా గర్విస్తున్నామని, ఆనందిస్తున్నామంటూ అభిమానులు చెప్పుకొచ్చారు.ఎప్పుడైతే సాహో విడుదలైందో పరిస్థితి మారిపోయింది.
సాహో చిత్రం అనుకున్న స్థాయిలో ఆడలేదు.సినిమా మరీ దారుణంగా ఉంది అంటూ విమర్శలు వస్తున్నాయి.ఇలాంటి సమయంలో దర్శకుడు సుజీత్ పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఎందుకంటే ఆయన ఎదుర్కొన్న ట్రోల్స్ మామూలువి కాదు.ప్రభాస్ కెరీర్ను నాశనం చేశావంటూ కొందరు, సాహో చిత్రంకు అంత బడ్జెట్ ఖర్చు చేసి తప్పు చేశావంటూ కొందరు.ఇలా రకరకాలుగా విమర్శిస్తూ ఆయన్ను టార్గెట్ చేశారు.
ప్రభాస్ నుండి మినిమం నటనను రాబట్టడంలో ఈయన విఫలం అయ్యాడనే టాక్ కూడా ఉంది.ఇంతటి విమర్శలు ఎదుర్కొంటున్న సుజీత్కు డెంగ్యూ ఫీవర్ ఎటాక్ అయినట్లుగా వార్తలు వస్తున్నాయి.
గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మరియు అంతటా కూడా డెంగ్యూ ఫీవర్ గురించిన వార్తలు వస్తున్నాయి.కొందరు మాత్రం సాహో విమర్శలను తట్టుకోలేక డెంగ్యూ ఫీవర్ డ్రామను సుజీత్ ఆడుతూ ఉన్నాడా అంటూ పిచ్చి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రం మాత్రమే కాకుండా దేశం మొత్తంలో కూడా ప్రస్తుతం డెంగ్యూ ఫీవర్ సీజన్ సాగుతోంది.ఇలాంటి సమయంలో సుజీత్ నిజంగానే డెంగ్యూకు గురై ఉంటాడనిపిస్తుంది.సాహో చిత్రం మరీ అంత దారుణమైన ఫలితాలను రాబట్టలేదు.దాదాపుగా 500 కోట్ల వసూళ్లను నమోదు చేయబోతుంది.
ఇండియన్ టాప్ చిత్రాల జాబితాలో సాహోకు ఛాన్స్ దక్కింది.అలాంటి సినిమాను తెరకెక్కించిన దర్శకుడిని ఖచ్చితంగా అభినందించాల్సిందే.