ప్రతిరోజు అందరిని అలరించే జీ తెలుగు ఈసారి దసరా సందర్భంగా ఛానల్ అభిమానులకు కానుకగా ‘సాహో’ సినిమాను వరల్డ్ తెలుగు టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం చేయబోతుంది.అక్టోబర్ 18 ఆదివారం నాడు, సాయంత్రం 4 : 30 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి ఛానళ్లలో తప్పక వీక్షించండి.
ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో దాదాపు 350 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా జాతీయ స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.ఈ సినిమాతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ లోను రంగప్రవేశం చేసారు.
దసరాకు ప్రసారంకానున్న సాహో గురించి ప్రభాస్ ఇటలీ నుంచి ఒక వీడియో పంపించారు.అందులో మాట్లాడుతూ, “హాయ్, డార్లింగ్స్, ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్ గా సాహో అక్టోబర్ 18 న 4: 30 PM జీ తెలుగులో ప్రసారం కానుంది.చూసి ఎంజాయ్ చేయండి.”
కథ విషయానికి వస్తే, వాజీ అనే సిటీ కేంద్రంగా గ్యాంగ్స్టర్స్ తమ కార్యకలాపాలను నిర్వహిస్తుంటారు.రాయ్ (జాకీ ష్రాఫ్) ఓ గ్రూప్ను ఫాం చేసి సిండికేట్ నడిపిస్తుంటాడు.ఆ క్రైమ్ వరల్డ్కు కింగ్ కావాలనుకున్న దేవరాజ్ (చంకీ పాండే), రాయ్ మీద పగ పెంచుకుంటాడు.
ఓ పని మీద ముంబై వచ్చిన రాయ్ ప్రమాదంలో చనిపోతాడు.ఇదే అదునుగా భావించిన దేవరాజ్ క్రైమ్ వరల్డ్ను తన చేతుల్లోకి తీసుకోవాలనుకుంటాడు.
కానీ అదే సమయంలో రాయ్ కొడుకు విశ్వక్ క్రైమ్ వరల్డ్లోకి అడుగుపెడతాడు.మరోవైపు ముంబైలో ఓ భారీ చోరీ జరుగుతుంది.
రెండు వేల కోట్లకు సంబంధించిన ఈ కేసును దర్యాప్తు చేయడానికి అండర్ కవర్ కాప్గా అశోక్ చక్రవర్తి (ప్రభాస్) ఎంట్రీ ఇస్తాడు.క్రైమ్ బ్రాంచ్ ఆఫీసర్ అమృతా నాయర్ (శ్రద్ధా కపూర్) తో కలిసి కేసు విచారణ మొదలు పెడతాడు.
ఈ క్రమంలో వారిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది.చివరకు అశోక్ ఆ కేసును సాల్వ్ చేశాడా…? అసలు క్రైమ్ సిండికేట్ను నడిపే రాయ్ ఎలా చనిపోయాడు? అశోక్, అమృత ప్రేమ ఏమైంది…? అసలు ఈ కథలో సాహో ఎవరు?
అసలు సాహో ఎవరు? తన కథ ఏమిటి అని తెలుసుకోవాలంటే అక్టోబర్ 18 ఆదివారం సాయంత్రం 4 : 30 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్ డి చూడాల్సిందే.