ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘సాహో’.భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రంను ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు.
ప్రభాస్కు జోడీగా ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్దా కపూర్ నటించిన విషయం తెల్సిందే.ఇక ఈ చిత్రంలోని ప్రత్యేక పాట కోసం విదేశీ ముద్దుగుమ్మ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ఆడి పాడిన విషయం తెల్సిందే.
మొదట ఆ ప్రత్యేక పాట ఛాన్స్ కాజల్కు వచ్చినట్లుగా తెలుస్తోంది.కాజల్ ఆ పాటను చేసేందుకు ఏకంగా 2 కోట్ల వరకు పారితోషికం అడిగిందని తెలుస్తోంది.రెండు వారాల డేట్లు అడిగినందుకు కాజల్ రెండు కోట్ల పారితోషికం డిమాండ్ చేయడంతో అవాక్కయిన చిత్ర యూనిట్ సభ్యులు కనీసం మరో మాట లేకుండా ఆమె స్థానంలో కేవలం కోటి రూపాయల పారితోషికంకు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ను తీసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.
ప్రస్తుతం కాజల్ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది.ఇలాంటి సమయంలో కోట్లు డిమాండ్ చేసి వచ్చిన ఆఫర్ను చేజార్చుకోవడం ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.తెలుగు సినిమా మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా గర్వించదగ్గ సాహోలో ఛాన్స్ వస్తే అంత సులభంగా ఎలా వదులుకున్నావంటూ ఆమెను ఆడిపోసుకుంటున్నారు.
సాహోలో ఐటెం సాంగ్ చేసి ఉంటే ఒక గొప్ప సినిమాలో నటించిన అనుభూతి ఎప్పటికి మిగిలి పోయేది.కాని కాజల్ డబ్బు ఆశతో ఆ ఛాన్స్ మిస్ చేసుకుంది.
.