యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో, యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది.భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాని ఆగష్టు 15న రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాతలు రెడీ అయ్యారు.
దానికి తగ్గట్లుగానే సినిమాని దర్శకుడు సుజిత్ సిద్ధం చేస్తున్న్నాడు.శ్రద్ధా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా బాలీవుడ్ తారాగణం కూడా సందడి చేస్తుంది.
ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి తాజాగా అప్డేట్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
సాహో సినిమా ట్రైలర్ ని ఈ నెల 13 ప్రేక్షకుల ముందుకి తెచ్చేందుకు డేట్ ఫిక్స్ చేసినట్లు సమాచారం.
ఇప్పటికే పోస్టర్స్, మేకింగ్ వీడియో తో హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ తో సినిమా మీద మరింత హైప్ క్రియేట్ చేయడానికి చిత్ర యూనిట్ సిద్ధం అయ్యిందని తెలుస్తుంది.సినిమా మార్కెట్ కోసం ఈ ట్రైలర్ ని చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.
ట్రైలర్ రిలీజ్ తర్వాత చాలా మంది బయ్యర్లు రైట్స్ కోసం పోటీ పడే అవకాశం ఉందని.ఈ నేపధ్యంలో ఆ పోటీని కాష్ గా మార్చుకోవడానికి ట్రైలర్ ని ఆసక్తికరంగా దర్శకుడు సుజిత్ సిద్ధం చేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది.
మరి ఇప్పటికే అంచనాలు పెంచిన సాహో మూవీ ట్రైలర్ ఎలా ఉండబోతుంది అనేది మరో మూడు రోజులలో తెలిసిపోయే అవకాశం ఉంది అని చెప్పాలి.