యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సాహో.భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ కొద్ది రోజుల క్రితం ముంబైలో ముగిసిపోయినట్లు చిత్ర దర్శకుడు సుజిత్ తన ట్విట్టర్ లో కన్ఫర్మ్ చేసాడు.
ఇక ప్రస్తుతం సినిమాకి సంబంధించిన ప్యాచ్ వర్క్స్ ఫినిష్ చేసే పనిలో దర్శకుడు ఉన్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే ఈ సినిమాని ఆగష్టు 15 రిలీజ్ చేస్తామని నిర్మాతలు ప్రకటించారు.
ఈ నేపధ్యంలో సినిమా రిలీజ్ కి ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది.ఈ నేపధ్యంలో ఇక సినిమా ప్రమోషన్ పైన కూడా గట్టిగా ద్రుష్టి పెట్టాలనే ఆలోచనతో ప్రభాస్ ఉన్నట్లు తెలుస్తుంది.
అయితే ఈ సినిమా నుంచి ఇంకా సాంగ్స్ బ్యాలెన్స్ ఉన్నాయని, వాటిని ఫినిష్ చేయడం కోసం మరో సారి యూరప్ వెళ్ళడానికి షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది.మరో వైపు చాలా వేగంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని ఫినిష్ చేసే పనిలో నిర్మాతలు ఉన్నారని సమాచారం.
ఇప్పటికే మెజారిటీ పోస్ట్ ప్రొడక్షన్ ఫినిష్ చేసారని తెలుస్తుంది.ఈ నేపధ్యంలో ఎత్తి పరిస్థితిలో ఆగష్టు లో రిలీజ్ కి పక్కా ప్లాన్ తో రంగం సిద్ధం చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.