ఆగస్టు 15న 'సాహో' రావడంపై అనుమానం!

ప్రభాస్‌ చిత్రం ‘సాహో’ కోసం గత రెండేళ్లుగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెల్సిందే.బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్‌ నటించిన చిత్రం ఇదే కావడంతో ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు వెయిట్‌ చేస్తున్నారు.

 Sahoo Movie Not Releasedin August 15th1 1tstop-TeluguStop.com

సాహో చిత్రంను సుజీత్‌ దర్శకత్వంలో వంశీ మరియు ప్రమోద్‌లో యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో దాదాపు 300 కోట్లతో నిర్మించినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

షూటింగ్‌ ప్రస్తుతం ముగింపు దశలో ఉంది.

సినిమాను ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు.సాహో చిత్రం భారీ యాక్షన్‌ సీన్స్‌తో తెరకెక్కించారు.

దాంతో దీనికి గ్రాఫిక్స్‌ వర్క్‌ కూడా ఎక్కువగా ఉందట.గ్రాఫిక్స్‌ వర్క్‌ పూర్తి కాకపోవడంతో పాటు, ఇంకా పాట చిత్రీకరణ జరుపుతున్నారు.

జులై చివరి వరకు ఈ వర్క్‌ పూర్తి కాకుంటే సినిమా విడుదల అయ్యేది అనుమానమే అంటూ కొందరు సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ చేస్తున్నారు.

ఆగస్టు 15న 'సాహో' రావడంపై అనుమాన

చిత్ర యూనిట్‌ సభ్యులు మాత్రం ‘సాహో’ చిత్రం విడుదలపై వ్యక్తం అవుతున్న అనుమానాలను కొట్టి పారేస్తున్నారు.ఖచ్చితంగా సినిమా ఆగస్టు 15వ తారీకున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లుగా చెబుతున్నారు.షూటింగ్‌ రెండు వారాల్లో పూర్తి కానుంది.

ఇక సినిమా పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ కూడా ఒక కొలిక్కి వచ్చాయి.జులై చివరి వరకు సినిమా ఫస్ట్‌ కాపీ వస్తుంది.

ఆగస్టు మొదటి వారంలో సెన్సార్‌ కూడా పూర్తి అవుతుందని నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ శ్రద్దా కపూర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో పలువురు బాలీవుడ్‌ స్టార్స్‌ కనిపించబోతున్నారు.500 కోట్ల టార్గెట్‌తో ఈ చిత్రం రాబోతుంది.అంత ప్రభాస్‌కు సాధ్యం అయ్యేనా చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube