ఏ దంపతులైనా తమకు బిడ్డ పుట్టబోతుందంటే చాలు ఎంతో ఆనందంగా ఉంటారు.తమ బిడ్డ ఈ ప్రపంచంలోకి ఎప్పుడు వస్తుందా, తాము ఎప్పుడు చూస్తామా, అని ఆశతో ఎదురు చూస్తుంటారు.
ఈ క్రమంలో బిడ్డ మంచిగా, ఆరోగ్యంగా, అందంగా పుట్టాలని కూడా కోరుకుంటారు.అయితే అందుకోసం మన దగ్గర చాలా మంది పురాతన కాలం నుంచి పాటిస్తూ వస్తున్న ఓ ఆరోగ్య చిట్కా కూడా ఉంది.
అదే కుంకుమ పువ్వును పాలలో కలిపి తాగడం.ఎంతో కాలంగా మన పెద్దలు, మనం దీన్ని పాటిస్తూ వస్తున్నాం.
అయితే కుంకుమ పువ్వును పాలలో కలుపుకుని తాగితే నిజంగానే బిడ్డ అందంగా పుడుతుందా.? అవునో, కాదో ఇప్పుడు తెలుసుకుందాం.
కుంకుమ పువ్వులో మన శరీరానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి.దీన్ని బిర్యానీ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తారు.కొందరు కూరల్లోనూ వాడుతారు.అయితే ప్రధానంగా గర్భిణీ మహిళలు దీన్ని నిత్యం పాలలో కలుపుకుని కూడా తాగుతుంటారు.పుట్టబోయే బిడ్డ చక్కని ఆరోగ్యంతో అందంగా పుట్టాలనేది వారి కోరిక.అయితే ఈ విషయంపై కొందరు సైంటిస్టులు పరిశోధనలు కూడా చేశారు.
వాటిలో తేలిందేమిటంటే, కుంకుమ పువ్వుకు, పుట్టబోయే బిడ్డ అందానికి సంబంధం లేదని తెలిసింది.కాకపోతే కుంకుమ పువ్వును పాలలో కలిపి తాగడం వల్ల గర్భిణీ శరీరంలోని రక్తం శుద్ధి అవుతుందట.
అంతేకాదు సహజ సిద్ధమైన మజిల్ రిలాక్సంట్ గుణాలు ఉండడం వల్ల పలు నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందట.ఈ క్రమంలో శిశువుకు కూడా రక్త సరఫరా బాగా జరుగుతుందట.
చర్మం ఆరోగ్యంగా వృద్ధి చెందుతుందట.అంతే కానీ దాని రంగులో మాత్రం మార్పు ఉండదట.
తల్లిదండ్రుల జీన్స్ ఆధారంగానే బిడ్డకు రంగు వస్తుందట.
బిడ్డ అందం గురించి కాకపోయినా, కుంకుమ పువ్వును గర్భిణీలు రోజూ తినడం వల్ల శిశువుకు ఆరోగ్యపరంగా మంచి జరుగుతుందట.అయితే గర్భిణీలు నిత్యం 10 గ్రాములకు మించకుండా కుంకుమ పువ్వును తీసుకోవాలట.లేదంటే దాంతో అనారోగ్య సమస్యలు వస్తాయట.
ఈ క్రమంలో మార్కెట్లో లూజ్గా దొరికే కుంకుమ పువ్వు కాకుండా ఐఎస్ఐ బ్రాండ్ కలిగి, ప్యాకింగ్ చేయబడ్డ కుంకుమ పువ్వునే వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.గర్భిణీలు 3వ నెల తరువాత నుంచి కుంకుమ పువ్వును తినవచ్చని, నిత్యం పాలలో 3 నుంచి 4 తీగల కుంకుమ పువ్వును వాడితే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
పాలను తాగలేని వారు, తాము తినే ఆహారంలోనూ కుంకుమ పువ్వును కలిపి తీసుకోవచ్చని చెబుతున్నారు.