ఈ మధ్య కాలంలో ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ మధ్య విభేదాలు రాజకీయాల నుంచి వ్యక్తిగతం వరకు వెళ్లిపోయాయి.మోడీ నాయకత్వంలో బీజేపీ చేతిలో రెండు సార్లు ఘోర ఓటమి చవిచూసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మనుగడ కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది.
అయితే రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ నేతలు పని చేయడానికి సిద్ధంగా ఉన్న కూడా ప్రజలు మాత్రం అంగీకరించలేకపోతున్నారు.ఇక ప్రధాని రేస్ లో ఉన్న రాహుల్ కాంగ్రెస్ కంచుకోట అయినా అమేథీ నియోజకవర్గంలో ఓడిపోయాడు.
ఇదిలా ఉంటే రాహుల్ తన నాయకత్వాన్ని ప్రజలకి చూపించుకొని మోడీకి సరిపోయే ప్రత్యర్థి అని నిరూపించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.అందులో భాగంగా కొద్ది రోజుల క్రితం బీజేపీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
బీజేపీ పాలనలో ప్రపంచానికి భారత్ అత్యాచారాల రాజధానిగా మారిందంటూ వ్యాఖ్యలు చేసారు.ఈ వాఖ్యలు సంచలనంగా మారడంతో పాటు భారత్ ని అవమానించే విధంగా ఉండటంతో వీటిపై విశ్వ హిందూ పరిషత్ నేత సాధ్వీ ప్రాచీ కౌంటర్ ఎటాక్ చేస్తూ సంచలన కామెంట్లు చేశారు.
భారత్ దేశ తొలి ప్రధాని జవహార్లాల్ నెహ్రూనే పెద్ద రేపిస్టు అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.మన దేశం రాముడు, కృష్టడు నడయాడిన పుణ్యభూమి.అలాంటి భారత దేశాన్ని నెహ్రూనే అనే పెద్ద రేపిస్టు మన సంస్కృతిని నాశనం చేశారు.టెర్రరిజమ్, నక్సలిజమ్, అవినీతి, అత్యాచారాలు పెరిగిపోవడానికి కారణం అయ్యాడు.
నెహ్రూ కుటుంబం ఇచ్చిన బహుమతులని వారసులుగా రాహుల్ కొనసాగిస్తున్నారని దయ్యబట్టారు.దీంతో సాద్వీ చేసిన వాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఆమె వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.