ఉత్తర ప్రదేశ్లో కుంభమేళ్ల మహా అద్బుతంగా సాగుతోంది.వందకు పైగా దేశాల నుండి కోట్లాది మంది తరలి వచ్చే ఈ కుంభ మేళ కోసం ప్రభుత్వం నభూతో నభవిష్యతి అన్నట్లుగా ఏర్పాట్లు చేసింది.
నాగ సాధువులు, అఘోరాలు, సన్యాసులు, సాధువులు ఇలా లక్షలాది మంది కూడా భక్తి పారవశ్యంలో మునిగి పోతున్నారు.గతంలో కుంభ మేళ సమయంలో మీడియా ఇంత ప్రాచుర్యం లేదు.
కాని ఈసారి వందలాది మీడియా ఛానెల్స్ ఉన్నాయి.ఆ మీడియా ఛానెల్స్ అన్నీ కూడా కుంభమేళను కవర్ చేసేందుకు అక్కడకు వెళ్లాయి.
కుంభమేళను అందరిలో సాదారణంగా కవర్ చేస్తే మా ఛానెల్ ఎవరు చూస్తారు, ఏదైనా ప్రత్యేకంగా ప్రయత్నిద్దాం, సాధువులను ఇంటర్వ్యూ చేద్దాం అనుకుంటూ కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.సాధువులు ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.అయినా కూడా వారిని పదే పదే అడగడంతో వారి సహనం నశిస్తుంది.మీడియా వారికి కొందరు సాధువులు తలనొప్పి భరించలేక కొద్ది పాటి ఇంటర్వ్యూ ఇస్తున్నారు.అయితే ఈ నాగ సాధువు మాత్రం తనను ఇంటర్వ్యూ అడిగిన ఒక లేడీ జర్నలిస్ట్ పరుగులు పెట్టేలా చేశాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఒక నాగసాధువు యాత్ర సాగిస్తున్న సమయంలో అతడితో మాట్లాడించేందుకు జాతీయ మీడియాకు చెందిన ఒక లేడీ జర్నలిస్ట్ వెళ్లింది.అతడిని ప్రశ్నించడం మొదలు పెట్టింది.
మీరు ఎప్పటి నుండి ఇలా సాధువుగా ఉన్నారు, మీరు ఎందుకు ఇలా అయ్యారు, మీ సమాధానం చెప్పండి అంటూ పదే పదే ప్రశ్నించింది.దాంతో అతడికి ఓపిక నశించి తన ఒంటిపై ఉన్న టవల్ తీసేశాడు.ఒంటిపై టవల్ తీసేసి పూర్తి నగ్నంగా తయారు అయ్యాడు.దాంతో ఆమె బాబోయ్ అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ నాగసాధువు చేసిన పని వైరల్ అవుతోంది.మీడియా వారికి తగిన బుద్ది వచ్చి ఉంటుందని మీమ్స్ వస్తున్నాయి.