తెలుగు దేశం పార్టీలో ఫైర్ బ్రాండ్గా గుర్తింపు దక్కించుకున్న సాదినేని యామిని తాజాగా పార్టీకి గుడ్ బై చెప్పిన విషయం తెల్సిందే.తెలుగు దేశంను వీడిన ఆమె ఏ పార్టీలో చేరేది ఇంకా నిర్ణయించుకోలేదట.
త్వరలోనే భవిష్యత్తు ప్రణాళికను సిద్దం చేసుకుంటాను అంటూ ప్రకటించింది.ఈ నేపథ్యంలోనే ఈమె మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తాను చాలా నేర్చుకున్నట్లుగా చెప్పుకొచ్చిన యామిని ఇదే సమయంలో ఆయనపై సంచలన వ్యాఖ్యలు చేసింది.
తన క్యారెక్టర్ గురించి బయట ప్రచారం జరుగుతున్న సమయంలో పార్టీ నుండి నాకు ఎలాంటి మద్దతు దక్కలేదు అంటూ ఆమె వాపోయింది.
తెలుగు దేశం పార్టీలో బంధాలు మరియు బంధుత్వాలకు ఎక్కువగా విలువ ఇస్తారని, చంద్రబాబు నాయుడు అందుకు అతీతుడు కాదంటూ ఆమె వ్యాఖ్యలు చేసింది.ఆయన నాయకత్వంపై కూడా యామిని సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆయన రాజకీయంగా తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా పార్టీ భవితవ్యం ఇలా అయ్యిందని, ముఖ్యంగా ప్రత్యేక హోదా విషయంలో రకరకాల మాటలు మార్చడం వల్ల టీడీపీకి చెడు జరిగిందటూ ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది.