ప్రపంచ ప్రతిష్టాత్మక యూనివర్సిటీ లలో ఒకటైన హార్వర్డ్ యూనివర్సిటీ నిర్వహించే సదస్సుకి తెలుగు రాష్టాల నుంచీ బాహుబలి డైరక్టర్ రాజమౌళి, లోక్ సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణలకి ఆహ్వానం అందింది.భారతీయ విద్యార్ధులు అందరూ సంయుక్తంగా ఈ సదస్సుని నిర్వహిస్తారు.అయితే ఇదే సదస్సుకి భారత్ నుంచీ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్…
మహారాష్ట్ర సీఎం ఫడణవీస్.రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ భూషణ్ మొదలగు వారికి సైతం ఈ సదస్సులో పాల్గొనే అరుదైన అవకాశం లభించింది.ఈ ప్రతిష్ఠాత్మక హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న భారత విద్యార్థులు ప్రతి సంవత్సరం ఈ సదస్సును నిర్వహిస్తారు…అయితే
భారత్-ఒక పరావర్తన మలుపు అనే అంశంపై ఈ సారి ఫిబ్రవరి 16, 17 తేదీల్లో నిర్వహించే సదస్సుకు వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన అరుణా రాయ్.మనూ జైన్…శ్రద్ధా శర్మ…పా రంజిత్.అరవింద్ సుబ్రమణ్యం తదితర ప్రముఖులను కూడా ఆహ్వానించినట్టుగా తెలుస్తోంది.
తాజా వార్తలు