టాలీవుడ్ హీరోయిన్ సదా గురించి మనందరికీ తెలిసిందే.మొదట జయం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ సదా ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో నటించి హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది.
అయితే తెలుగులో నటించినది కొన్ని సినిమాలే అయినప్పటికీ హీరోయిన్ గా తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకుంది.ఇక హీరోయిన్ సదా పేరు వినగానే మనకు వెళ్ళవయ్యా వెళ్ళు అనే డైలాగ్ గుర్తుకొస్తుంది.
అయితే తెలుగులో అడపాదడపా సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న సదా ఆ తర్వాత అపరిచితుడు సినిమాలో విక్రమ్ సరసన నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.
ఆ తర్వాత సినిమాలకు బై బై చెప్పేసిన సదా తర్వాత కొద్ది రోజులపాటు ఎక్కడ కనిపించలేదు.
ఆ తర్వాత కొద్ది రోజులకి మళ్లీ బుల్లితెర కి రీఎంట్రీ ఇచ్చి పలు షోలకు జడ్జిగా వ్యవహరించిన విషయం తెలిసిందే.ఇదిలా ఉంటే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సదా.ఇంటర్వ్యూలో సినిమా విషయాలతో పాటుగా తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంది.అయితే సాధారణంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ లు స్టార్ డమ్ నుంచి పడిపోయినప్పుడు వారి స్క్రిప్ట్ ఎంపిక లోపం వలనో లేక అవకాశాలో రాకనో కొన్ని బోల్డ్ సినిమాలు నటిస్తూ ఉంటారు.
అటువంటి సినిమాలు అలాంటి పాత్రలలో నటించడం వల్ల ఆ హీరోయిన్ లకు ప్రశంసల కంటే విమర్శలు ఎక్కువగా వస్తుంటాయి.కొన్ని సార్లు తీవ్ర అవమానాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.అయితే ఇంటర్వ్యూలో భాగంగా హీరోయిన్ సదా మాట్లాడుతూ.శ్రీమతి 21F సినిమాలో వేశ్యపాత్రలో నటించినప్పుడు చాలా విమర్శలు, అవమానాలు ఎదుర్కొన్నాను అని చెబుతూ ఎమోషనల్ అయ్యింది సదా.ఈ క్రమంలోనే తాను ఎందుకు అలాంటి సినిమాలు చేయాల్సి వచ్చింది కారణాలు తెలిపింది.ప్రస్తుతం సదా మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వీటితో పాటుగా మరెన్నో విషయాలను ఆ ఇంటర్వ్యూలో పంచుకుంది సదా.అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.