బాలీవుడ్లో ప్రముఖ సీనియర్ దర్శకుడు మహేష్ భట్ ప్రస్తుతం సడక్ 2 అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ క్వీన్ ఆలియా భట్, సీనియర్ హీరో సంజయ్ దత్, పూజ భట్ ఆదిత్యరాయ్ కపూర్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు.
కాగా ఈ చిత్రాన్ని టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత ముఖేష్ ఇస్తున్నాడు.
అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని ఈ చిత్ర యూనిట్ సభ్యులు యూట్యూబ్ లో విడుదల చేశారు.
దీంతో ఈ చిత్ర ట్రైలర్ ని విడుదల చేసిన ఒక్కరోజులోనే దాదాపు 2 కోట్ల 30 లక్షల పైచిలుకు వ్యూస్ వచ్చాయి. అలాగే ఈ చిత్ర ట్రైలర్ కి దాదాపుగా 70 లక్షల పైచిలుకు డిస్ లైకులు వచ్చాయి.
దీంతో కొందరు సినీ నెటిజన్లు ఈ విషయంపై స్పందిస్తూ ఇటీవలే బాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య లో మహేష్ భట్ పరోక్ష పాత్ర ఉందని అందువల్లనే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమానులు ఇలా డిస్ లైక్ ల రూపంలో తమ ఆక్రోశాన్ని చూపించారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో కొంతమేర చిత్ర యూనిట్ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
అలాగే ఈ చిత్ర విడుదలను కొంతమేర సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ హత్య కేసు విచారణ పూర్తయ్యే వరకు వాయిదా వేస్తే బాగుంటుందని భావిస్తున్నారు.ఏదేమైనప్పటికీ ఈ చిత్ర ట్రైలర్ విడుదలయిన ఒకరోజు లేని ఎన్ని డిస్ లైక్ లు పొందడం ఇదే మొదటిసారి.