తెలుగు సినిమా ఇండస్ట్రీలో సింగర్ సునీత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఎన్నో అద్భుతమైన పాటల ద్వారా ఎంతో మంది ప్రేక్షకులను సొంతం చేసుకున్న సునీత ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు.
కెరియర్ పరంగా బిజీగా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో తరచు యాక్టివ్ గా ఉంటూ అభిమానుల సందడి చేస్తుంటారు.ఈ క్రమంలోనే సునీత ప్రస్తుతం డ్రామా జూనియర్స్ కార్యక్రమానికి జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
డ్రామా జూనియర్స్ కార్యక్రమంలో భాగంగా సునీత తన జీవితంలో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకుని భావోద్వేగం అయ్యారు.జీ తెలుగులో ప్రసారమయ్యే డ్రామా జూనియర్స్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు.
ఈ ప్రోమోలో భాగంగా పిల్లలు తమ స్కిట్ల ద్వారా అందరినీ ఎంతో అలరింప చేశారు.ఈ క్రమంలోనే ఒక అమ్మాయి ఈ సమాజంలో ఆడపిల్ల అబ్బాయిలతో స్నేహం చేస్తే సమాజం తీరు ఏ విధంగా ఉంటుంది? వారిద్దరి మధ్య ఎలాంటి బంధాన్ని కలుపుతారు అనే విషయాలను గురించి ఎంతో అద్భుతంగా చేసి చూపించారు.
ఈ ప్రోమోలో భాగంగా ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలతో స్నేహం చేస్తుంది.ఈ క్రమంలోనే ఆమెకు ఇరుగుపొరుగు కుటుంబాల నుంచి, ఆఫీసులో వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉందని అవమాన పరుస్తూ ఉంటారు.అబ్బాయితో కలిసి తిరుగుతుంటావని హేళన చేస్తారు.ఇలా అమ్మాయి చేసిన ఈ స్కిట్ కి సింగర్ సునీత స్పందించారు.స్కిట్ అనంతరం సునీత మాట్లాడుతూ ఈ రోడ్డుపై ఆంటీలు.ఆఫీసులో బాసులు ఇవన్నీ కలిపితే నా జీవితంలో ఒకే ఒక క్యారెక్టర్ అంటూ తన జీవితంలో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకుని భావోద్వేగం అయ్యారు.
కొన్ని సార్లు మన కుటుంబ సభ్యులకంటే ఎవరైనా స్వచ్ఛంగా ఉన్నార ? అంటే అది కేవలం స్నేహితులని ఈ సందర్భంగా సునీత తెలియజేశారు.