టాలీవుడ్ హీరో రానా తన సొంత బ్యానర్ సురేష్ ప్రొడక్షన్స్లో ప్రముఖ నిర్మాణ సంస్థ డీఏఆర్తో కలిసి ముత్తయ్య మురళిధరన్ జీవిత చరిత్రను నిర్మించబోతున్న విషయం తెల్సిందే.శ్రీలంకతో పాటు ప్రపంచ వ్యాప్తంగా తన బౌలింగ్ మరియు ప్రవర్తనతో విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు.
అలాంటి ముత్తయ్య మురళిధరన్ బయోపిక్ చాలా ఆసక్తికరంగా తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.హిందీతో పాటు పలు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ముత్తయ్య మురళిధరన్ పాత్రను తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి పోషించబోతున్నాడు.ఇక ఈ చిత్రంలోని సచిన్ పాత్ర కోసం ఏకంగా సచిన్ టెండూల్కర్నే రంగంలోకి దించాలనే ఉద్దేశ్యంతో చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు.తాజాగా డీఏఆర్ నిర్మాణ సంస్థ ప్రతినిధులు సచిన్ నుండి అగ్రిమెంట్ తీసుకోవడం జరిగిందట.సినిమా నిర్మాణం ప్రారంభం అయిన తర్వాత సచిన్ డేట్లు తీసుకుని చిత్రీకరణ చేపట్టనున్నారు.
సచిన్ కనీసం వారం రోజుల పాటు ఈ చిత్రం షూటింగ్లో పాల్గొంటాడనే టాక్ వినిపిస్తుంది.
‘800’ అంటూ ఈ చిత్రంకు టైటిల్ను పరిశీలిస్తున్నారు.ముత్తయ్య మురళి ధరన్ జీవితంలోని ఎత్తు పల్లాలను చాలా కమర్షియల్గా చూపించేందుకు దర్శకుడు స్క్రిప్ట్ను సిద్దం చేస్తున్నాడు.ఇక ఈ చిత్రంలో ముత్తయ్య మురళి ధరన్ భార్య కూడా కీలక పాత్రలో కనిపించబోతుంది.
ఆయన భార్య పాత్రనే ఆమె పోషిస్తుందా లేదంటే మరేదైనా ముఖ్య పాత్రలో ఆమె కనిపిస్తుందా అనేది చూడాలి.భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా రూపొందబోతున్న ఈ చిత్రంను 2020లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.