బీజేపీ పర్యవేక్షణలో సచిన్ వర్గీయులు -కాంగ్రెస్ నేత

రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ బీజేపీ పర్యవేక్షణలో ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పీఎల్ పునియా ఆరోపించారు.ఆయన ప్రస్తుతం హర్యానాలోని ఓ హోటల్‎లో ఉన్నారని పునియా అన్నారు.

 Rajasthan, Sachin Pilot, Bjp, Congres Leader Punia, Congress Leaders-TeluguStop.com

సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని మండిపడ్డారు.బీజేపీ పార్టీ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని పునియా విమర్శించారు.

సచిన్ పైలట్‎తో సహా ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు అందరూ హర్యానాలోని ఓ హోటల్‎లో బస చేస్తున్నారని చెప్పారు.వారిని కలిసేందుకు బయటి వ్యక్తులను అనుమతించడం లేదని పీఎల్ పునియా ఆరోపించారు.

కాగా, రాజస్థాన్ ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభంలో హర్యానా ప్రభుత్వం పాత్ర ఏమి లేదని ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ స్పష్టం చేశారు.తమ రాష్ట్రంలో సచిన్ పైలట్ వర్గానికి చెందిన 18 ఎమ్మెల్యేలకు ఆశ్రయం కల్పించలేదని అన్నారు.

సీఎం అశోక్ గెహ్లాట్ శాసన సభను సమావేశపరచాలని గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను కోరిన సంగతి తెలిసిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube