రాజస్థాన్ మాజీ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ బీజేపీ పర్యవేక్షణలో ఉన్నారని కాంగ్రెస్ సీనియర్ నేత పీఎల్ పునియా ఆరోపించారు.ఆయన ప్రస్తుతం హర్యానాలోని ఓ హోటల్లో ఉన్నారని పునియా అన్నారు.
సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని మండిపడ్డారు.బీజేపీ పార్టీ ఆధ్వర్యంలోనే ఇవన్నీ జరుగుతున్నాయని పునియా విమర్శించారు.
సచిన్ పైలట్తో సహా ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు అందరూ హర్యానాలోని ఓ హోటల్లో బస చేస్తున్నారని చెప్పారు.వారిని కలిసేందుకు బయటి వ్యక్తులను అనుమతించడం లేదని పీఎల్ పునియా ఆరోపించారు.
కాగా, రాజస్థాన్ ప్రభుత్వంలో ఏర్పడిన సంక్షోభంలో హర్యానా ప్రభుత్వం పాత్ర ఏమి లేదని ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ విజ్ స్పష్టం చేశారు.తమ రాష్ట్రంలో సచిన్ పైలట్ వర్గానికి చెందిన 18 ఎమ్మెల్యేలకు ఆశ్రయం కల్పించలేదని అన్నారు.
సీఎం అశోక్ గెహ్లాట్ శాసన సభను సమావేశపరచాలని గవర్నర్ కల్ రాజ్ మిశ్రాను కోరిన సంగతి తెలిసిందే.