కరోనా ప్రస్తుతం దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తోంది.ఊహించకుండా విజృంభించిన సెకండ్ వేవ్ దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న పరిస్థితి ఉంది.
ఇక చాలామంది పల్స్ రేట్ పడిపోవడంతో మృతి చెందుతున్న వల్ల ప్రభుత్వలు అప్రమత్తమై అన్ని ఆసుపత్రులలో ఆక్సిజన్ ను సరఫరా చేయడానికి ప్రయత్నం చేస్తోంది.అయినా సరఫరా అవుతోంది కొంచెం మాత్రమే.
కావలసింది చాలా ఉంది.ఈ సమయంలో చాలా మంది దాతలు ఎవరి స్థాయిలో వారు ఆక్సీజన్ ను కాని, ఆర్ధిక సహాయాన్ని అందుబాటులో ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు.
ఈ సమయంలో క్రికెట్ గాడ్ సచిన్ టెందూల్కర్ తన గొప్ప మనసును చాటుకున్నాడు.
దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల ఆర్తనాదాలు, కళ్ల ముందే ప్రాణాలు పోతుండడాన్ని చూసి చలించిపోయిన సచిన్ టెండూల్కర్ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు పోతున్నందున ఆక్సిజన్ నిల్వలు పెంచాలి, త్వరితగతిన ఆక్సిజన్ ను కోవిడ్ బాధితులకు అందజేయాలనే లక్ష్యంతో ఏర్పాటైనమిషన్ ఆక్సిజన్సంస్థకు తన వంతుగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించాడు.
ఇక సచిన్ టెండూల్కర్ చేసిన ఈ గొప్ప పనికి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు.స్వతహాగా మంచి మనసున్న సచిన్ దేశంలో ఎప్పుడు క్లిష్ట పరిస్థితులు ఏర్పడ్డా తన వంతుగా ఏదో రూపంలో అండగా ఉండే ప్రయత్నం చేస్తాడు సచిన్ టెండూల్కర్.