చేవెళ్ళ టీఆర్ఎస్ అభ్యర్ధిగా సబిత తనయుడు?

మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరడం కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది.ఆమెని బుజ్జగించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన కూడా పార్టీలో తన మాటకి విలువ లేకపోవడం, అలాగే తనకి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పాటు తన కుమారుడుకి ఎంపీ టికెట్ విషయంలో కూడా అధిష్టానం నుంచి హామీ రాకపోవడంతో సబితా ఇంద్రారెడ్డి తీవ్ర అసంతృప్తిలో వున్నట్లు తెలుస్తుంది.

 Sabita Son Karthik Reddy Trs Mp Candidate In Chevella-TeluguStop.com

ఈ నేపధ్యంలో ఆమె పార్టీ మారాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఇదిలా వుంటే సబిత కుమారుడు కార్తిక్ రెడ్డికి చేవెళ్ళ పార్లమెంట్ సీటు ఇస్తామని కేసీఆర్ నుంచి ఇప్పటికే హామీ కూడా రావడంతోనే ఆమె టీఆర్ఎస్ లో వెళ్ళడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది.

ఇక ఈ విషయాన్ని ఒకటి రెండు రోజులలో అధికారికంగా నిర్ధారించే అవకాశం వుందని సమాచారం.ఇదిలా వుంటే సబిత తీసుకున్న నిర్ణయం పట్ల అధిష్టానం తీవ్ర అసహనంతో వుందని టాక్ వినిపిస్తుంది.

ఈ నేపధ్యంలో ఆమె రాజీనామా చేయడానికంటే ముందుగానే ఆమెని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube