యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.ఆ సినిమా ఇచ్చిన బూస్ట్తో ప్రభాస్ సాహో చిత్రంలో నటించాడు.
భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో ప్రభాస్ యాక్టింగ్కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.కానీ కంటెంట్లో దమ్ము లేకపోవడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేయలేకపోయింది.
యంగ్ డైరెక్టర్ సుజీత్ ఈ సినిమాను డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయిన ఈ చిత్రం ఇప్పుడు జపాన్ దేశంలో సాహో అనిపించుకుంటోంది.
కరోనా వైరస్ నుండి కోలుకున్న దేశాల్లో జపాన్ కూడా ఒకటి.ఇప్పుడిప్పుడే అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి.
ఈ క్రమంలోనే అక్కడ థియేటర్లను కూడా తెరిచారు.ఈ క్రమంలోనే అక్కడ సాహో చిత్రాన్ని రిలీజ్ చేశారు.
ఈ సినిమాకు అక్కడి జనం పట్టం కడుతున్నారు.అదిరిపోయే కలెక్షన్లతో సాహో అక్కడ హల్చల్ చేస్తోంది.
జపాన్లో రిలీజ్ అయిన ఇండియన్ చిత్రాల్లో ఎక్కవ గ్రాస్ కలెక్ట్ చేసిన 5వ చిత్రంగా సాహో నిలిచింది.
మొత్తానికి కరోనా దెబ్బకు అన్ని దేశాల్లో చాలా దారుణమైన పరిస్థితులు నెలకొనగా, జపాన్లో మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.
సాహో చిత్రం ఇక్కడ జనాలను మెప్పించకపోయినా, అక్కడ దుమ్ములేపుతుండటంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ చేసుకుంటున్నారు.ఇక ప్రస్తుతం రాధేశ్యామ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ప్రభాస్ రెడీ అవుతున్నాడు.
మరి ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.