చిరునో చెప్పడంతో మల్టీస్టారర్‌కు రెడీ అయిన దర్శకుడు

మెగాస్టార్‌ ప్రస్తుతం చేస్తున్న ఆచార్య చిత్రం షూటింగ్‌ పూర్తి అయిన తర్వాత లూసీఫర్‌ రీమేక్‌లో నటించాలనుకుంటున్నాడు.కరోనా కారణంగా ఆచార్య షూటింగ్‌ జరగని కారణంగా లూసీఫర్‌ ఆలస్యం అవుతోంది.

 Director Sujeeth, Chiranjeevi, Saaho, Multi Starrer Movie, Director Sujeeth Mult-TeluguStop.com

మొన్నటి వరకు లూసీఫర్‌ రీమేక్‌కు సాహో దర్శకుడు సుజీత్‌ దర్శకత్వం వహించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి.కాని సుజీత్‌ రెడీ చేసిన స్క్రిప్ట్‌ చిరంజీవికి ఏమాత్రం నచ్చలేదట.

రీమేక్‌ను ఉన్నది ఉన్నట్లుగా కాకుండా మార్చాడని, అయితే ఏమాత్రం అది ఆకట్టుకోలేక పోయిందని చిరంజీవి ఆయన్ను పక్కకు పెట్టాడట.

ఇలాంటి సీరియస్‌ సబ్జెక్ట్‌లను డీల్‌ చేయడం సుజీత్‌కు కష్టం అనే ఉద్దేశ్యంతో రీమేక్‌ బాధ్యతల నుండి తప్పించినట్లుగా టాక్‌ వినిపిస్తుంది.

ఈ విషయంలో చిరంజీవి నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం సుజీత్‌ తన వద్ద ఉన్న ఒక కథను యూవీ వారి ముందు ఉంచాడు.ఇప్పటికే తన మొదటి రెండు సినిమాలు యూవీ క్రియేషన్స్‌లో చేసిన సుజీత్‌ మూడవ సినిమాను కూడా అక్కడే చేయబోతున్నాడు.

సుజీత్‌పై నమ్మకంతో యూవీ నిర్మాతలు వంశీ ప్రమోద్‌లు ఆయనకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు.

Telugu Chiranjeevi, Sujeeth, Sujeethmulti, Multi Starrer, Saaho-

శర్వానంద్‌ మరియు గోపీచంద్‌లతో సుజీత్‌ తన కొత్త సినిమాను చేయబోతున్నాడు.వీరిద్దరికి ఇప్పటికే కథ చెప్పాడు.ఇద్దరు కూడా కథపై పాజిటివ్‌గా స్పందించారు.

త్వరలోనే వారు నటించేది లేనిది క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.మొత్తానికి సుజీత్‌ ఈసారి మల్టీస్టారర్‌తో ప్రేక్షకుల ముందుకు రావడం అనేది కన్ఫర్మ్‌ అయ్యింది.

భారీ అంచనాలున్న లూసీఫర్‌ నుండి తప్పించినా సుజీత్‌ వెంటనే మల్టీస్టారర్‌ ను కన్ఫర్మ్‌ చేసుకోవడం అతడి లక్‌ గా చెప్పుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube